Megastar Chiranjeevi : కేరళ వయనాడ్ బాధితులకు మెగాస్టార్ భారీ విరాళం.. ఎంతంటే..?

తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు భారీ విరాళం ఇచ్చారు.

Megastar Chiranjeevi : కేరళ వయనాడ్ బాధితులకు మెగాస్టార్ భారీ విరాళం.. ఎంతంటే..?

Megastar Chiranjeevi Announced huge Amount to Kerala cm relief fund Wayanad Incident

Megastar Chiranjeevi : కేరళలోని వయనాడ్‌ జిల్లాలో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి జరిగిన ప్రమాదంలో ఇప్పటికే 300 మందికి పైగా మరణించగా చాలామంది నిరాశ్రయులు అయ్యారు. వయనాడ్ బాధితులకు దేశ వ్యాప్తంగా విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. కేరళ రాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళాలు పంపిస్తున్నారు. ఈ క్రమంలో అనేకమంది సౌత్ సినీ పరిశ్రమల సెలబ్రిటీలు కూడా వయనాడ్ కోసం కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు తమ విరాళాలు అందచేస్తున్నారు.

Also Read : Allu Arjun : కేరళ వయనాడ్ బాధితులకు అల్లు అర్జున్ విరాళం.. ఎంతంటే..?

తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు భారీ విరాళం ఇచ్చారు. చిరంజీవి ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. చిరంజీవి తన సోషల్ మీడియాలో.. గత కొన్ని రోజులుగా కేరళలో జరిగిన విపత్తుని చూసి చలించిపోయాను. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన నన్ను చాలా కదిలించింది. నేను, చరణ్ కలిసి కోటి రూపాయలు కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు బాధితుల కోసం అందిస్తున్నాము. ఆ బాధ నుంచి అందరూ కోలుకోవాలి అని ప్రార్థిస్తున్నాను అని పోస్ట్ చేశారు. దీంతో చిరంజీవిని మరోసారి అభిమానులు, నెటిజన్లు అందరూ అభినందిస్తున్నారు. గతంలో కూడా అచిరంజీవి ఎన్నో సేవా కార్యక్రమాలు, ఇలాంటి ఎన్నో దానాలు చేసి ప్రజల మెప్పు పొందిన సంగతి తెలిసిందే.

ఇక ఇప్పటికే అల్లు అర్జున్ 25 లక్షలు, మోహన్ లాల్ 3 కోట్లు, కమల్ హాసన్ 25 లక్షలు, రష్మిక మందన్న 10 లక్షలు, నయనతార – విగ్నేష్ జంట 20 లక్షలు, తెలుగు నిర్మాత నాగవంశీ 5 లక్షలు, సూర్య, జ్యోతిక, కార్తీ కలిపి 50 లక్షలు, విక్రమ్ 20 లక్షలు, మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్ 35 లక్షలు, ఫహద్ ఫాజిల్ , నజ్రియా కలిపి 25 లక్షలు విరాళాలు ఇచ్చారు. ఇంకా పలువురు సినీ నటీనటులు, ప్రముఖులు వయనాడ్ కి విరాళాలు ప్రకటిస్తున్నారు.