Bro Movie : ‘కాంబాబు రాసలీలలు’ మూవీ పోస్టర్ రిలీజ్.. సంజన, సుకన్య క్యాప్షన్.. త్వరలో గంటా, అరగంట..!
అంబటి రాంబాబు పై సినిమా తీస్తామంటూ ప్రకటించితిన్ జనసైనికులు.. తాజాగా 'కాంబాబు రాసలీలలు' అనే పోస్టర్ రిలీజ్ చేశారు.
![Bro Movie : ‘కాంబాబు రాసలీలలు’ మూవీ పోస్టర్ రిలీజ్.. సంజన, సుకన్య క్యాప్షన్.. త్వరలో గంటా, అరగంట..! Bro Movie : ‘కాంబాబు రాసలీలలు’ మూవీ పోస్టర్ రిలీజ్.. సంజన, సుకన్య క్యాప్షన్.. త్వరలో గంటా, అరగంట..!](https://10tv.in/wp-content/uploads/2023/08/Pawan-Kalyan-Ambati-Rambabu-Bro-Movie-controversy-Janasena.jpg)
Pawan Kalyan Ambati Rambabu Bro Movie controversy Janasena
Bro Movie : పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటించిన బ్రో సినిమా ఏపీలో (Andhra Pradesh) రాజకీయ రచ్చకు దారితీస్తుంది. సినిమాలోని ‘శ్యాంబాబు’ అనే పాత్ర ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ మంత్రి ‘అంబటి రాంబాబు’ని (Ambati Rambabu) పోలి ఉందంటూ కామెంట్స్ రావడంతో ఈ గొడవ మొదలైంది. దీంతో ఒక పక్క నుంచి అంబటి, మరోపక్క నుంచి జనసైనికులు విమర్శకు ప్రతి విమర్శలు చేసుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే అంబటి పవన్ పై సినిమాలు తీస్తాను అంటూ ‘నిత్య పెళ్లి కొడుకు’, ‘మూడు ముళ్లు-ఆరు పెళ్లిళ్లు’.. ఇలా పలు టైటిల్స్ అనౌన్స్ చేశారు.
Ambati Rambabu : పవన్ కల్యాణ్పై మంత్రి అంబటి రాంబాబు సినిమా.. టైటిల్ ఏంటో తెలుసా
ఇక దీనికి సమాధానంగా జనసైనికులు అంబటి పై సినిమా తీస్తామంటూ పలు టైటిల్స్ అనౌన్స్ చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ టైటిల్ పోస్టర్ ని కూడా ఆవిష్కరించారు. ‘కాంబాబు రాసలీలలు’ అనే టైటిల్ ని పెట్టారు. ఈ సినిమాకి కొల్లేరుకు చెందిన జనసేన మత్స్యకార విభాగ రాష్ట్ర వైస్ చైర్మన్ మోరు వెంకట నాగరాజు నిర్మాతగా వ్యవహరించబోతున్నాడు. ఏలూరు జనసేన నాయకుడు చందు తాతపూడి ఈ సినిమాని డైరెక్ట్ చేయబోతున్నాడు.
కాగా రిలీజ్ చేసిన పోస్టర్లో.. “పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో ప్రొడక్షన్ నెంబర్ 420, కామం స్టార్ అంబటి కాంబాబు హీరో అని ఉంది. అంతేకాదు కాంబాబు రాసలీలలు టైటిల్ కింద ‘సంజన, సుకన్య’ అంటూ క్యాప్షన్ పెట్టి అంబటి రాంబాబు ఫోటోని పోస్టర్ లో డైరెక్ట్ గా వేయడం ఇప్పుడు వివాదం అవుతుంది. అలాగే త్వరలో గంటా, అరగంట టైటిల్స్ తో కూడా సినిమాలు తీయబోతున్నట్లు ప్రకటించారు.
Salaar : సలార్ హాలీవుడ్లో కూడా రిలీజ్.. ఇంగ్లీష్ డబ్బింగ్తో.. రిలీజయిన 15 రోజులకి..
ఇది ఇలా ఉంటే, అమెరికా నుంచి బ్రో మూవీకి అక్రమ ఫండింగ్ జరిగిందని, ఈ మూవీ లావాదేవీల పై పిర్యాదు చేయడానికి అంబటి ఢిల్లీ కూడా వెళ్లనున్నారు. దీని పై కూడా జనసైనికులు విమర్శలు చేస్తున్నారు. అంబటి ఇరిగేషన్ మంత్రి అయిన తరువాత ఏనాడు పోలవరం ప్రాజెక్ట్ పై చర్చేందుకు ఢిల్లీకి వెళ్లలేదని, ఇప్పుడు బ్రో మూవీ పై పిర్యాదు చేయడానికి వెళ్తుండడం శోచనీయం అంటూ జనసైనికులు కామెంట్స్ చేస్తున్నారు.