Ayodhya Ram Mandir : అయోధ్యలో సూపర్ స్టార్, పవర్ స్టార్.. వీడియోలు వైరల్..
అయోధ్యలో సూపర్ స్టార్ రజినీకాంత్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. రామ మందిరం ప్రారంభోత్సవం గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..

Pawan Kalyan Rajinikanth at Ayodhya Ram Mandir Opening Ceremony
Ayodhya Ram Mandir : ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం రేపు జనవరి 22న ఘనంగా జరగబోతుంది. అయోధ్యలోని రాముని ప్రాణప్రతిష్ఠని కళ్లారా చూసేందుకు దేశం నలుమూలల నుంచి రామ భక్తులు అక్కడికి బయలు దేరుతున్నారు. అలాగే ఈ మహత్తర కార్యక్రమానికి దేశంలోని పలువురు ప్రముఖులు కూడా హాజరుకాబోతున్నారు. సినీ, రాజకీయ రంగంలోని పలువురు ప్రముఖులకు ప్రత్యేక ఆహ్వానాలు అందాయి.
ఈక్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ రజినీకాంత్ కి కూడా ఆహ్వానాలు అందాయి. దీంతో ఈ ఇద్దరు స్టార్స్ నేడు అయోధ్యకి చేరుకున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ రామ మందిరం ప్రారంభోత్సవం గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. “ఇది ఎన్నో ఏళ్ళ కల. 500 సంవత్సరాల తరువాత ఇప్పుడు నిజం కాబోతుంది. అందుకు ఎంతో సంతోషిస్తున్నాను” అంటూ పేర్కొన్నారు.
Also read : Ram Mandir Opening Ceremony : వెండితెరపై రామ మందిర ప్రారంభోత్సవం లైవ్.. ఎక్కడ? ఎప్పుడు?
#WATCH | Uttar Pradesh | Superstar Rajinikanth arrives at a hotel in Ayodhya, ahead of the Ram Temple pranpratishtha tomorrow. pic.twitter.com/IJFYH7WGyP
— ANI (@ANI) January 21, 2024
#WATCH | Uttar Pradesh: Jana Sena chief Pawan Kalyan arrives in Lucknow, ahead of the Ayodhya Ram Temple Pranpratishtha ceremony that will be held tomorrow.
He says, “This has been a long-cherished dream of the people and after 500 years, it is finally coming into reality, we… pic.twitter.com/JEY4QnO6qn
— ANI (@ANI) January 21, 2024
కాగా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి టాలీవుడ్ నుంచి మెగా ఫ్యామిలీకి కూడా ఆహ్వానం అందింది. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దంపతులు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరుకాబోతున్నారు. ప్రస్తుతానికి టాలీవుడ్ నుంచి వెళ్తున్న వారి లిస్టులో వీరి పేర్లు మాత్రం బయటకి వచ్చాయి. మరి ఇంకెవరన్నా ఉన్నారా లేదా అనేది రేపు తెలుస్తుంది.