Ayodhya Ram Mandir : అయోధ్యలో సూపర్ స్టార్, పవర్ స్టార్.. వీడియోలు వైరల్..

అయోధ్యలో సూపర్ స్టార్ రజినీకాంత్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. రామ మందిరం ప్రారంభోత్సవం గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..

Ayodhya Ram Mandir : అయోధ్యలో సూపర్ స్టార్, పవర్ స్టార్.. వీడియోలు వైరల్..

Pawan Kalyan Rajinikanth at Ayodhya Ram Mandir Opening Ceremony

Ayodhya Ram Mandir : ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం రేపు జనవరి 22న ఘనంగా జరగబోతుంది. అయోధ్యలోని రాముని ప్రాణప్రతిష్ఠని కళ్లారా చూసేందుకు దేశం నలుమూలల నుంచి రామ భక్తులు అక్కడికి బయలు దేరుతున్నారు. అలాగే ఈ మహత్తర కార్యక్రమానికి దేశంలోని పలువురు ప్రముఖులు కూడా హాజరుకాబోతున్నారు. సినీ, రాజకీయ రంగంలోని పలువురు ప్రముఖులకు ప్రత్యేక ఆహ్వానాలు అందాయి.

ఈక్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ రజినీకాంత్ కి కూడా ఆహ్వానాలు అందాయి. దీంతో ఈ ఇద్దరు స్టార్స్ నేడు అయోధ్యకి చేరుకున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ రామ మందిరం ప్రారంభోత్సవం గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. “ఇది ఎన్నో ఏళ్ళ కల. 500 సంవత్సరాల తరువాత ఇప్పుడు నిజం కాబోతుంది. అందుకు ఎంతో సంతోషిస్తున్నాను” అంటూ పేర్కొన్నారు.

Also read : Ram Mandir Opening Ceremony : వెండితెరపై రామ మందిర ప్రారంభోత్సవం లైవ్.. ఎక్కడ? ఎప్పుడు?

కాగా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి టాలీవుడ్ నుంచి మెగా ఫ్యామిలీకి కూడా ఆహ్వానం అందింది. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దంపతులు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరుకాబోతున్నారు. ప్రస్తుతానికి టాలీవుడ్ నుంచి వెళ్తున్న వారి లిస్టులో వీరి పేర్లు మాత్రం బయటకి వచ్చాయి. మరి ఇంకెవరన్నా ఉన్నారా లేదా అనేది రేపు తెలుస్తుంది.