దేశంలో నమోదైన కరోనా కేసుల్లో 76 శాతం పురుషులే : లవ్ అగర్వాల్ 

దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4 వేల 67కు చేరిందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. ఢిల్లీలోని మర్కజ్ వెళ్లొచ్చిన వారిలో 1445 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారించినట్లు తెలిపారు. 

  • Published By: veegamteam ,Published On : April 6, 2020 / 07:08 PM IST
దేశంలో నమోదైన కరోనా కేసుల్లో 76 శాతం పురుషులే : లవ్ అగర్వాల్ 

Updated On : April 6, 2020 / 7:08 PM IST

దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4 వేల 67కు చేరిందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. ఢిల్లీలోని మర్కజ్ వెళ్లొచ్చిన వారిలో 1445 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారించినట్లు తెలిపారు. 

దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4 వేల 67కు చేరిందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. ఈ మేరకు సోమవారం (ఏప్రిల్ 6, 2020) ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. 24 గంటల్లో 693 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. 30 మంది కరోనాతో మృతి చెందారని వెల్లడించారు. ఢిల్లీలోని మర్కజ్ వెళ్లొచ్చిన వారిలో 1445 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారించినట్లు తెలిపారు. 

అయితే ఇప్పటివరకు దేశంలో నమోదైన కరోనా కేసుల్లో 76 శాతం పురుషులే ఉన్నారని పేర్కొన్నారు. దేశంలో కరోనా వ్యాప్తి నియంత్రణకు జాతీయ ఆరోగ్య మిషన్ కింద కేంద్ర ప్రభుత్వం 1100 కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు తెలిపారు. మరో 3 వేల కోట్ల రూపాయలను రాష్ట్రాలకు కేటాయిస్తామని చెప్పారు.

దేశంలోని 274 జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. మిగిలిన జిల్లాలు సేఫ్ గా ఉన్నాయి. దేశంలోని మొత్తం 736 జిల్లాలు ఉన్నాయి. మొత్తం కరోనా కేసుల్లో 80శాతం కేసులు కేవలం 62 జిల్లాల కోటాయే. మిగిలిన జిల్లాలో అక్కడక్క కరోనా కేసులున్నాయి. అందుకే దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 తర్వాత లాక్ డౌన్ ను ఎత్తివేసినా, ఈ జిల్లాల్లో లాక్‌డౌన్ కంటిన్యూ అవుతుందని ఉన్నతస్థాయి వర్గాలు అంటున్నాయి.

ఇప్పటివరకు 274 జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో 4,067 కేసుల్లో 328 మందికి నయమైతే 118 మంది చనిపోయారు. అంటే మరణాల శాతం 2.7. మొత్తం కేసుల్లో రికవరీ రేటు 7.6శాతం. ఇంతవరకు దేశంలో ఒక్కరు కూడా ICUల్లోకూడా లేరు. అదే మార్చి 30నాటికి కేసులు 1,251 ఐతే, 32 మంది మర.

కరోనా కొన్ని ప్రాంతాల్లోనే చాలా ఎక్కువగా వ్యాప్తి చెందింది. వీటిని హాట్ స్పాట్‌గా పిలుస్తున్నారు. అంటే 62 జిల్లాలే కరోనా కేంద్రాలు. అందుకే ఈ జిల్లాలను నిర్భందించి, కరోనా కట్టడి కోసం ప్రయత్నిస్తున్నాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. టెస్టింగ్ లు పెరిగాయి. రెండు రోజుల్లోనే రెండింతలయ్యాయి. వచ్చే వారంలో టెస్టింగ్‌ల సంఖ్య రెండింతలు కానుంది.(ఆ తల్లులకు పాదపూజ చేస్తా : సీఎం కేసీఆర్)

కరోనా కేసులు ఎక్కువగా నమోదువుతున్న ఈ 62 జిల్లాల సరిహద్దులను మూసేసి, కట్టుదిట్టంగా దిగ్బందించారు. ఈ నిర్భంధాన్నే అనధికారికంగా  “Bhilwara model”అని కేంద్రం పేరు పెట్టింది. గాల్లోకూడా కరోనా వ్యాపిస్తోందన్న వాదనలకు సరైన రుజులు లేవని Indian Council of Medical Research (ICMR) తేల్చేసింది.

personal protective equipment (PPE)లు చాలావరకు అందుబాబులో వచ్చాయి. మొదట్లో పిపిఈలు లేక రెయిన్ కోట్లేసుకొని డాక్టర్లు కరోనా పేషెంట్లకు చికిత్సచేశారన్న విమర్శలొచ్చాయి. అందుకే ప్రభుత్వం త్వరపడింది. దేశీయంగా PPE తయారీకి అనుమతిచ్చిన తర్వాత ఒకేసారి వేల కొద్ది అందుబాటులోకి రావడంతో దేశవ్యాప్తంగా పంపిణీ మొదలుపెట్టారు. విదేశాల నుంచి PPEలను దిగుమతి కూడా చేసుకుంటున్నారు.