Akash Prime మిసైల్ ప్రమోగం విజయవంతం

  ఢిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) సోమవారం ఒడిశాలోని చండీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుండి ఆకాష్ మిసైల్ యొక్క కొత్త వెర్షన్ - ‘ఆకాష్ ప్రైమ్’ ను విజయవంతంగా

Akash Prime మిసైల్ ప్రమోగం విజయవంతం

Akash

Updated On : September 27, 2021 / 9:51 PM IST

Akash Prime  ఢిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) సోమవారం ఒడిశాలోని చండీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుండి ఆకాష్ మిసైల్ యొక్క కొత్త వెర్షన్ – ‘ఆకాష్ ప్రైమ్’ ను విజయవంతంగా పరీక్షించింది. ఆకాష్ ప్రైమ్ మిసైల్..తొలి విమాన పరీక్షలో శత్రు విమానాలను అనుకరించే మానవరహిత వైమానిక లక్ష్యాన్ని గుర్తించి నాశనం చేసినట్లు DRDO ఒక ప్రకటనలో తెలిపింది.

ఆకాష్ ప్రైమ్‌ లో స్వదేశీ ఆర్ఎస్ సీకర్ ఉంది. ఇది వివిధ వాతావరణ పరిస్థితులలో-ఉత్తర మరియు ఈశాన్య సరిహద్దుల వంటి అధిక ఎత్తు కలిగిన ఆపరేషనల్ ఏరియాల్లోని తక్కువ ఉష్ణోగ్రత వాతావరణంలో కూడా లక్ష్యాలను గుర్తించేటప్పుడు మెరుగైన ఖచ్చితత్వాన్ని అందిస్తుంది.

READ  భారత్ లోకి నిషేధిత డ్రగ్స్ అసలు ఎలా వస్తున్నాయో తెలుసా

క్షిపణి ప్రయోగం విజయవంతంతో.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, DRDO చైర్మన్ డాక్టర్ జీ సతీష్ రెడ్డి రక్షణ దళాలను అభినందించారు. ప్రపంచ స్థాయి క్షిపణి వ్యవస్థల అభివృద్ధి, రూపకల్పన మరియు ఉత్పత్తిలో DRDO యొక్క సామర్థ్యాన్ని క్షిపణిని విజయవంతంగా పరీక్షించడం ద్వారా రుజువు చేసినట్లు రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. క్షిపణి వ్యవస్థ యొక్క తాజా వెర్షన్ త్రివిధ సాయుధ దళాలు – ఇండియన్ ఆర్మీ, నేవీ మరియు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) విశ్వాసాన్ని మరింత పెంచుతుందని DRDO చైర్మన్ సతీష్ రెడ్డి అన్నారు. భారతదేశం అత్యంత దృష్టి సారించిన ఆత్మనిర్భర్ భారత్ మిషన్‌లో ఒక అడుగు ముందుకేసినందున ఈ ప్రయోగం ముఖ్యమైనది, ఇది రక్షణరంగంలో స్వీయ-ఆధారితకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తుందని ఆయన అన్నారు.

READ  గోవాలో కాంగ్రెస్ కి బిగ్ షాక్..మాజీ సీఎం రాజీనామా..టీఎంసీలో చేరిక