ఈ ఏడాది అమర్​నాథ్​ యాత్ర రద్దు

  • Published By: venkaiahnaidu ,Published On : July 21, 2020 / 09:03 PM IST
ఈ ఏడాది అమర్​నాథ్​ యాత్ర రద్దు

Updated On : July 21, 2020 / 10:10 PM IST

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అమర్​నాథ్​ యాత్ర రద్దైంది .కరోనా కారణంగా ఈ ఏడాది అమర్‌నాథ్‌ యాత్రను రద్దు చేస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగిన శ్రీ అమర్‌నాథ్‌ దేవాలయ బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ వర్చువల్‌ భేటీలో జమ్ముకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ జీసీ ముర్ము, పోలీసు, పరిపాలనా విభాగంలో ఉన్నతాధికారులు, బోర్డు సభ్యులు పాల్గొన్నారు.

కొవిడ్‌-19 కేసులు పెరిగిపోతున్న దృష్ట్యా.. ముందు జాగ్రత్త చర్యగా ఈ ఏడాది అమర్‌నాథ్‌ యాత్రను రద్దు చేయాలని ఈ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. గత ఏడాది ఆర్టికల్‌ 370 రద్దు సందర్భంగా అమర్‌నాథ్‌ యాత్ర వ్యవధిని కుదించిన విషయం తెలిసిందే.

కాగా ఇంతకముందు కరోనా దృష్ట్యా అమర్‌నాథ్‌ యాత్రను రద్దు చేయాలని వేసిన పిటిషన్‌ను జులై 13న సుప్రీంకోర్టు కొట్టివేసింది. కరోనా నేపథ్యంలో టెలివిజన్‌, ఇంటర్నెట్‌ ద్వారా భక్తులకు ప్రత్యక్ష దర్శనం కల్పించాలని కేంద్రాన్ని సుప్రీం కోర్ట్ ఆదేశించింది