రామజన్మభూమిలోనే రామాలయం : అయోధ్య తీర్పులో కీలక అంశాలు ఇవే

  • Published By: venkaiahnaidu ,Published On : November 9, 2019 / 12:03 PM IST
రామజన్మభూమిలోనే రామాలయం : అయోధ్య తీర్పులో కీలక అంశాలు ఇవే

Updated On : November 9, 2019 / 12:03 PM IST

యావత్ భారతం దశాబ్దాలుగా ఎదురుచూసిన అయోధ్య తీర్పును నవంబర్ 9,2019 శనివారం సుప్రీంకోర్టు వెలువరించిన విషయం తెలిసిందే. అయోధ్యలోని  రామ జన్మభూమి-బాబ్రీ మసీదు భూ యాజమాన్య వివాదంపై సీజేఐ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసం ఏకగ్రీవ తీర్పు వెల్లడించింది. తీర్పుని సీజేఐ స్వయంగా చదివి వినిపించారు. ఈ సందర్భంగా తీర్పు సమయంలో ధర్మాసం చేసిన ముఖ్య వాఖ్యలను ఒక్కసారి చూద్దాం.

– రాజకీయాలకు, చరిత్రకు అతీతంగా న్యాయం ఉండాలి
– పురావస్తు నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకున్నాం
– రాముడు అయోధ్యలోనే జన్మించాడన్నది నిర్వివాదాంశం
– యాజమాన్య హక్కులనేవి నిర్దేశిత న్యాయ సూత్రాల ప్రకారం నిర్ణయిస్తాం
– రాముడు అయోధ్యలోనే పుట్టాడని ముస్లింలు కూడా అంగీకరిస్తారు.
– బాబ్రీ మసీదు నిర్మాణానికి ముందే ఆ స్థలంలో ఒక నిర్మాణం ఉంది. దాన్ని కూల్చారనడానికి ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఆధారాలు చూపించలేదు
– వివాదాస్పద స్థలంలో మసీదు లేదని, అక్కడ ఓ నిర్మాణం ఉందని పురావస్తు విభాగం చెబుతోంది.
– మొఘలుల సమయం నుంచే హక్కు ఉన్నట్లు వక్ఫ్ బోర్డు నిరూపించలేకపోయింది.
– శుక్రవారం రోజు ప్రార్థనలు చేసినట్లు మాత్రమే వక్ఫ్ బోర్డు ఆధారాలు సమర్పించింది.
– వివాదాస్పద స్థలం లోపల ముస్లింలు, బయట హిందువులు ప్రార్థనలు చేసేవారు.
– మసీదు ఎవరు కట్టారో.. ఎప్పుడు కట్టారో స్పష్టం కాలేదని అలహాబాద్ హైకోర్టు చెప్పింది.
– మసీదును కర సేవకులు కూల్చివేయడం చట్టవిరుద్ధం
– ఈ కేసుకు ఆర్టికల్ 47వర్తించదు.
– వివాదాస్పద స్థలాన్ని విభజించే ప్రశ్నే లేదు.
– వివాదాస్పదంగా ఉన్న 2.77ఎకరాల స్థలం హిందువులకే.
– స్థల నిర్వహణ, ఆలయ బాధ్యతలు చూసేందుకు కేంద్రం ఆధ్వర్యంలో ట్రస్ట్ ఏర్పాటవ్వాలి
– వివాదాస్పద స్థలాన్ని కొత్త ఆలయ ట్రస్టుకు అప్పగించాలి.
– అయోధ్య ట్రస్ట్‌కు మూడు నెలల్లోగా భూమిని అప్పగించాలి.
– అయోధ్యలోనే ముఖ్యమైన స్థలంలో 5 ఎకరాలు ముస్లింలు మసీదు నిర్మించుకునేందుకు ప్రభుత్వం కేటాయించాలి.