BJP Appoint Observers : మూడు రాష్ట్రాల్లో కొత్త సీఎంల ఎంపికకు బీజేపీ పరిశీలకులు
అసెంబ్లీ ఎన్నికలు జరిగిన మూడు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులను ఎంపిక చేసేందుకు బీజేపీ పరిశీలకులను నియమించాలని నిర్ణయించింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించినా ఇంకా ముఖ్యమంత్రులు ఎవరనేది ఇంకా తేలలేదు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా గురువారం దేశ రాజధానిలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో కీలక సమావేశం నిర్వహించారు....
ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన మూడు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులను ఎంపిక చేసేందుకు బీజేపీ పరిశీలకులను నియమించాలని నిర్ణయించింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించినా ఇంకా ముఖ్యమంత్రులు ఎవరనేది ఇంకా తేలలేదు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా గురువారం దేశ రాజధానిలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో కీలక సమావేశం నిర్వహించారు. మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి పేరు చెప్పకుండానే ఎన్నికల్లో పోటీ చేసింది.
ALSO READ : Chennai rain: మిగ్జామ్ తుపాన్తో చెన్నైలో భారీవర్షాలు, వరదలు…పాఠశాలలు మూసివేత
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లలో భారతీయ జనతా పార్టీ తిరుగులేని విజయాలు నమోదు చేసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా కీలక సమావేశం తర్వాత దేశ రాజధానిలోని కేంద్ర హోం మంత్రి అమిత్ షా నివాసం నుంచి బయలుదేరారు. అంతకుముందు భోపాల్లో, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ల సీఎంలపై డిసెంబర్ 10న తుది నిర్ణయం తీసుకుంటామని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయవర్గియా చెప్పారు.
ALSO READ : Telangana CM Revanth Reddy : చకా చకా హామీల అమలు…తొలిరోజే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు
కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలలోంచి సీఎంను ఎంపిక చేస్తారా లేక పార్టీ బయటి నుంచి తీసుకువస్తుందా అనే విషయాన్ని వెల్లడించడం లేదు. మూడు రాష్ట్రాలకు ముగ్గురు పరిశీలకులను బీజేపీ ఎంపిక చేయనున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మూడు రాష్ట్రాల్లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల సమావేశాలను పర్యవేక్షించే బాధ్యతను పరిశీలకులకు అప్పగించవచ్చు. బీజేపీ శాసనసభ్యులు తమ నాయకులను ఎన్నుకోనున్నారు.
ALSO READ : Varanasi : వరణాసి ఆశ్రమంలో నలుగురు ఆంధ్రా కుటుంబ సభ్యుల ఆత్మహత్య
రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి,బీజేపీ నాయకురాలు వసుంధర రాజే గురువారం దేశ రాజధానిలోని నడ్డా నివాసంలో నడ్డాతో సమావేశమయ్యారు. వసుంధర రాజే రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. విద్యాధర్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన దియా కుమారి, తిజారా నియోజకవర్గం నుంచి గెలిచిన మహత్ బాలక్ నాథ్, ఝోత్వారా నియోజకవర్గం నుంచి గెలుపొందిన రాజ్యవరార్ధన్ సింగ్ రాథోడ్ రాజస్థాన్ సీఎం పదవి కోసం పోటీ పడేవారిలో ఉన్నారు.
ALSO READ : Manipur : మణిపూర్ సర్కార్ సంచలన నిర్ణయం… 30 ఏళ్ల తర్వాత సంపూర్ణ మద్య నిషేధం ఎత్తివేత
మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ మరియు రాజస్థాన్ ముఖ్యమంత్రుల ఎంపికను పర్యవేక్షించేందుకు భారతీయ జనతా పార్టీ (బిజెపి) శుక్రవారం కేంద్ర పరిశీలకులను ప్రకటించే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. మధ్యప్రదేశ్కు చెందిన సీనియర్ నేత, కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్, రాజస్థాన్కు చెందిన మహంత్ బాలక్నాథ్తో అమిత్ షా భేటీ అయ్యారు.