Power Failure: కరెంట్ పోయింది.. చీకట్లో వధువు సోదరికి తాళి కట్టిన వరుడు
మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో వింత వివాహం జరిగింది. కరెంట్ పోవడంతో వధువుకు బదులు ఆమె సోదరికి తాళి కట్టాడు వరుడు. అత్తారింటికి వెళ్లబోతుండగా అసలు విషయం తెలిసి నానా రచ్ఛ జరిగింది.
Power Failure: మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో వింత వివాహం జరిగింది. కరెంట్ పోవడంతో వధువుకు బదులు ఆమె సోదరికి తాళి కట్టాడు వరుడు. అత్తారింటికి వెళ్లబోతుండగా అసలు విషయం తెలిసి నానా రచ్ఛ జరిగింది.
ఒకే ముహూర్తానికి ఇద్దరు సోదరీమణులకు వివాహం ఫిక్స్ చేశారు. కరెంటు వైఫల్యం కారణంగా కొద్దిగా గందరగోళం నెలకొంది. చీకటిలో ఒకే డ్రెస్సులో ఉన్న వధువులను పోల్చుకోలేకపోయాడు వరుడు. దాంతో తప్పు వధువుతో వివాహ వేడుక పూర్తయిపోయింది.
ఆదివారం నాడు రమేష్లాల్ ఇద్దరు కుమార్తెలు నికిత, కరిష్మాలకు వేర్వేరు కుటుంబాలకు చెందిన దంగ్వారా భోలా, గణేష్ ఇద్దరు యువకులతో వివాహం జరిగింది. వధూవరులు ముసుగు ధరించి ఉండడం, ఇద్దరి దుస్తులు ఒకేలా ఉండడంతో పెళ్లి జరుగుతున్న సమయంలో ఎవరికీ అంతు చిక్కడం లేదు.
Read Also: వరుడుని కాదని వేరే వ్యక్తిని పెళ్లిచేసుకున్న వధువు.. ఎందుకో తెలిస్తే అవాక్కవుతారు..
పెళ్లి పండిట్ కూడా ‘మారిన’ వధువులతో ప్రదక్షిణలు చేయాలని వరులకు చెప్పాడు. పెళ్లి తంతు ముగిశాక అత్తారింటికి వెళ్లగా తమ వధువుల గురించి తెలుసుకుని అవాక్కయ్యారు.
కొద్ది సేపు వాగ్వాదం జరగడంతో ఓ కొలిక్కి వచ్చింది. మరుసటి రోజు మరోసారి వివాహ వేడుక జరిపించాలని నిర్ణయించుకున్నారు.