CBSE Exams : రెండు భాగాలుగా సీబీఎస్ఈ సిలబస్, ఎగ్జామ్స్
కరోనా నేపథ్యంలో విద్యార్థుల కోసం సరికొత్త విధానాన్ని సీబీఎస్ఈ(Central Board of Secondary Education)ప్రకటించింది.
CBSE Exams కరోనా నేపథ్యంలో విద్యార్థుల కోసం సరికొత్త విధానాన్ని సీబీఎస్ఈ(Central Board of Secondary Education)ప్రకటించింది. వచ్చే ఏడాది నుంచి 10, 12వ తరగతి విద్యార్థులకు సంబంధించి విద్యాసంవత్సరాన్ని రెండు భాగాలుగా చేయనున్నట్లు సీబీఎస్ఈ బోర్డు సోమవారం ప్రకటించింది. సిలబస్ను కూడా రెండు భాగాలు చేస్తున్నట్లు ప్రకటించింది.
ఒక పరీక్షను నవంబర్- డిసెంబర్ 2021లో, మరో పరీక్షను మార్చి- ఏప్రిల్ 2022 లో నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ రెండు పరీక్షల్లోని ఫర్ఫార్మెన్స్ ఆధారంగా తుది ఫలితాలు ప్రకటించబడతాయి మరియు రెండు టర్మ్ ఎగ్జామ్ లకు పరీక్షలకు సమాన వెయిటేజ్ ఇవ్వబడుతుంది. ఈ మేరకు సీబీఎస్ఈ ఓ సర్క్యులర్ జారీ చేసింది.