సుష్మా, జైట్లీ తర్వాత మోడీనే…బ్రిటన్ ఎంపీ వివాదాస్పద ట్వీట్

ఆర్టికల్ 370 రద్దు అంశంపై భారత్ పై పాక్ కారాలు మిరియాలు నూరుతోంది. ఇరు దేశాల మధ్యా మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆర్టికల్ 370 రద్దుపై బ్రిటన్ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ మూలాలు ఉన్న బ్రిటన్ ఎంపీ నజీర్ అహ్మద్ ప్రధాని మోడీపై ట్విట్టర్ వేదికగా వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. వరుసగా బీజేపీ అగ్రనేతలు ఇటీవల కాలంలో మరణించారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని నజీర్ అహ్మద్ ట్విట్టర్ వేదికగా..సుష్మా, జైట్లీ తరువాత ప్రధానమంత్రి మోడీ అంటూ ట్వీట్ చేశారు.
బీజేపీ పై ప్రతిపక్ష పార్టీ చేతబడి లాంటి పనులు ఎదో చేసిందని అందుకే బీజేపీలో దిగ్గజాలు ఒక్కొక్కరుగా చనిపోతున్నారు అంటూ ట్వీట్ చేశారు. వాజ్ పేయి , మనోహర్ పారికర్ , సుష్మా ,జైట్లీ, తర్వాత మోడీనే అంటూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ దారుణమైన వ్యాఖ్యలపై కేంద్రమంత్రులతో పాటు పలు పార్టీల నేతలు,నెటిజన్లు నజీర్ అహ్మద్ పై ఫైర్ అయ్యారు. మోడీపై ఇంత దారుణమైన వ్యాఖ్యలు చేస్తారా అంటూ ఆ ఎంపీని సోషల్ మీడియా వేదికగా చీల్చి చెండారారు. చివరికి ఆ ఎంపీ వివాదాస్పద ట్వీట్ డిలీట్ చేసిందాకా ఆయనను వదిలిపెట్టలేదు.
కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు బ్రిటన్ ఎంపీ వివాదాస్పద ట్వీట్ పై ఘాటుగా స్పందిచారు. హౌస్ ఆఫ్ లార్డ్స్ లోకి నువ్వు ఎలా వెళ్ళావో మాకు ఇప్పటికీ అర్థం కావడంలేదు. ఎవరిని అయినా మేనేజ్ చేసి ఎంపీగా గెలిచావా అంటూ దిమ్మతిరిగేలా కౌంటర్ ఇచ్చారు.చివరికి ఆ ఎంపీ వివాదాస్పద ట్వీట్ డిలీట్ చేసిందాకా ఆయనను వదిలిపెట్టలేదు.
Claims of sorcery, Jadoo , magic, witchcraft, on @BJP4India by opposition Jaitley, Gaur former CM of Madhya Pradesh, Shushma Swaraj , Atal Vajpayee , Manohar Parrikar CM Goa and Arun Jaitley … have all died in the last one year hey @narendramodi is next https://t.co/Kqfco5RXk9
— Lord Nazir Ahmed (@nazir_lord) August 26, 2019