రాఫెల్ రాకతో జడుసుకున్న పాక్…అక్కసు వెళ్లగక్కిన దాయాది దేశం

  • Published By: venkaiahnaidu ,Published On : July 30, 2020 / 08:25 PM IST
రాఫెల్ రాకతో జడుసుకున్న పాక్…అక్కసు వెళ్లగక్కిన దాయాది దేశం

Updated On : July 30, 2020 / 9:34 PM IST

భారత్ గడ్డపై భయానక శబ్దం చేస్తూ దిగిన రాఫెల్ ఫైటర్ జెట్లను గమనించిన పాకిస్థాన్ జడుసుకుంటున్నది. రాఫెల్ యుద్ధ విమానాలు భారత్ కు రావడాన్ని పాకిస్తాన్ జీర్ణించుకోలేకపోతోంది. తొలిదశలో భాగంగా సోమవారం ఫ్రాన్స్ నుంచి బయలుదేరిన 5 రాఫెల్ విమానాలు బుధవారం(జులై-29,2020) హర్యానాలోని అంబాలా ఎయిర్ బేస్ కు చేరుకున్న విషయం తెలిసిందే. అంబాలాలో అడుగుపెట్టిన రాఫెల్ ఫైటర్లను చూసిన పాక్ తన అక్కసును వెళ్లగక్కింది.

భద్రతా అవసరాలకు మించి సైనిక సామర్ధ్యాలను భారత్ కూడగట్టుకుంటోందంటూ పాకిస్థాన్ తన కుళ్లుబోతుతనాన్ని మరోసారి ప్రదర్శించింది. రాఫెల్ విమానాలు ఇప్పుడు భారత్ కు ఏం అవసరం, వారు భద్రతకు కావాల్సిన సైనిక సామర్ధ్యాలను మించి కూడగట్టుకుంటున్నారని పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొన్నది. దక్షిణ ఆసియాలో ఆయుధ పోటీకి దారితీసే భారతదేశాన్ని అసమానమైన ఆయుధాల సేకరణ నుంచి నిరోధించాలని ప్రపంచ సమాజాన్ని కోరుతున్నామన్నారు. నిన్న అంబాలా ఎయిర్ బేస్ వద్ద ఐదు రాఫెల్ జెట్ విమానాలు ల్యాండ్ అయిన తరువాత పాకిస్తాన్ నుంచి వచ్చిన మొదటి అధికారిక స్పందన ఇది.


రాఫెల్ రాకతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క స్క్వాడ్రన్ బలం ఇప్పుడు 31 కి చేరుకున్నది. ఈ విమానం రకరకాల మిషన్లను నిర్వహించగల సామర్థ్యం ఉన్నందున భారత వైమానిక దళానికి రాఫేల్‌ రాక గేమ్ చేంజర్ సముపార్జనగా రక్షణ, భద్రతా విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ జెట్లను భూమి, సముద్ర దాడులకు ఉపయోగించవచ్చు. ఎలక్ట్రానిక్ వార్ఫేర్, ఎయిర్ డిఫెన్స్, గ్రౌండ్ సపోర్ట్ , భారీ దాడులను కూడా చేయడానికి వీలుంటుంది.

విజువల్ రేంజ్ ఎయిర్-టు-ఎయిర్ క్షిపణి, స్కాల్ప్ క్రూయిజ్ క్షిపణి, ఎంఐసీఏ ఆయుధాల వ్యవస్థకు మించిన ఉల్కాపాతం సహా అనేక రకాల ఆయుధాలను ఈ విమానం మోయగలదు. ఇది కాకుండా, రాఫెల్ జెట్‌లతో అనుసంధానించడానికి కొత్త తరం మీడియం-రేంజ్ మాడ్యులర్ ఎయిర్-టు-గ్రౌండ్ ఆయుధ వ్యవస్థ, ఖచ్చితమైన-గైడెడ్ క్షిపణి.. హామర్‌ను కూడా ఇండియన్ ఎయిర్ఫోర్స్ కొనుగోలు చేస్తున్నది.