ఇప్పుడు అవసరం వచ్చిందా : 17ఏళ్ల తర్వాత ఉద్యోగం కావాలంటున్నాడు

తొలగింపుకు గురైన ఓ ఐఏఎస్‌ ఆఫీసర్ 17 ఏళ్ల తర్వాత వచ్చి తనకు ఉద్యోగం కావాలన్నాడు. అమెరికాలోని ఓ యూనివర్సిటీ ప్రొఫెసర్‌గా చేరి, తిరిగి భారత్‌ కు వచ్చి తనకు ఉద్యోగం ఇప్పించాలని ఇప్పించాలని ప్రధాని మోడీని కోరాడు.

  • Published By: veegamteam ,Published On : November 3, 2019 / 04:50 AM IST
ఇప్పుడు అవసరం వచ్చిందా : 17ఏళ్ల తర్వాత ఉద్యోగం కావాలంటున్నాడు

Updated On : November 3, 2019 / 4:50 AM IST

తొలగింపుకు గురైన ఓ ఐఏఎస్‌ ఆఫీసర్ 17 ఏళ్ల తర్వాత వచ్చి తనకు ఉద్యోగం కావాలన్నాడు. అమెరికాలోని ఓ యూనివర్సిటీ ప్రొఫెసర్‌గా చేరి, తిరిగి భారత్‌ కు వచ్చి తనకు ఉద్యోగం ఇప్పించాలని ఇప్పించాలని ప్రధాని మోడీని కోరాడు.

తొలగింపుకు గురైన ఓ ఐఏఎస్‌ ఆఫీసర్ 17 ఏళ్ల తర్వాత వచ్చి తనకు ఉద్యోగం కావాలన్నాడు. అమెరికాలోని ఓ యూనివర్సిటీ ప్రొఫెసర్‌గా చేరి, తిరిగి భారత్‌ కు వచ్చి తనకు ఉద్యోగం ఇప్పించాలని ఇప్పించాలని ప్రధాని మోడీని కోరాడు. 1984 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి రాజేష్‌ సింగ్‌ కు ఉత్తరప్రదేశ్‌లో పోస్టింగ్‌ వచ్చింది. అయితే పీహెచ్‌డీ కోసం రెండేళ్ల కాలానికి ప్రభుత్వ అనుమతితో 1996లో అమెరికా వెళ్లారు. తిరిగి భారత్‌కు రాలేదు.

ఉత్తరాఖంఢ్‌లో ఆయనకు పోస్టింగ్‌ వచ్చింది. తర్వాత (ఆగస్టు12, 2001) వరకూ సెలవులు కోరుతూ దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వం అనుమతించింది. మళ్లీ (డిసెంబర్‌ 31, 2001) వరకూ సెలవులు పొడిగించుకున్నారు. మళ్లీ ఆరు నెలలు కావాలంటూ దరఖాస్తు చేసుకోగా, ప్రభుత్వం తిరస్కరించింది. విధుల్లో చేరాలని యూపీ ప్రభుత్వం ఆదేశించింది. ఎంతకీ తిరిగి రాకపోవడంతో, చట్టం ప్రకారం ఐదేళ్లకు మించి విధులకు దూరంగా ఉండటంతో విధుల నుంచి 2003లో తొలగించారు. తనను విధుల్లో చేర్చుకోవాలంటూ 2017లో ప్రధాని మోడీకి ఆయన లేఖ రాశారు. 

ప్రధాని దాన్ని తిరస్కరించడంతో, సెంట్రల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. అక్కడా తిరస్కరణే ఎదురైంది. కొద్ది రోజుల పాటు సెలవులు పెడితేనే వివరణ ఇచ్చుకోవాల్సి ఉంటుందని, అలాంటిది సంవత్సరాల తరబడి సెలవులు ఎలా పెడతారని ట్రిబ్యునల్‌ మొట్టికాయలు వేసింది.