Priyanka Gandhi : జిఎస్టి నుంచి వీటికి మినహాయింపు ఇవ్వండి : ప్రియాంక గాంధీ
ఈ రోజు జరగబోయే 43వ వస్తు, సేవల పన్ను (జిఎస్టి) సమావేశం సందర్బంగా కరోనావైరస్పై పోరాటంలో ఉపయోగించే మందులు, పరికరాలన్నింటినీ జీఎస్టీ తొలగించాలని కాంగ్రెస్ నాయకుడు

Priyanka Gandhi
Priyanka Gandhi: ఈ రోజు జరగబోయే 43వ వస్తు, సేవల పన్ను (జిఎస్టి) సమావేశం సందర్బంగా.. కరోనావైరస్పై పోరాటంలో ఉపయోగించే మందులు, పరికరాలన్నింటినీ జీఎస్టీ నుంచి తొలగించాలని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా కోరారు. ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ శానిటైజర్స్, హ్యాండ్ వాష్, సబ్బులు, కాటన్ మాస్క్లు, పిపిఇ కిట్లు, కోవిడ్ -19 టీకా, రెమ్డెసివిర్ మరియు ఇతర కోవిడ్ మందులు, వెంటిలేటర్లు..
కృత్రిమమైన 15 వస్తువులకు వర్తించే జిఎస్టి రేట్ల జాబితాను ట్విట్టర్లో ఆమె జత చేశారు. శ్వాసక్రియ పరికరాలకు సంబంధించి ప్రజల దగ్గరినుంచి పన్నులు వసూలు చేయడం క్రూరమైనదని ఆమె అన్నారు. కాగా 43వ వస్తు, సేవల పన్ను (జిఎస్టి) కౌన్సిల్ సమావేశం ఈ రోజు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా జరగనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు.