Underwater Metro : భార‌త్‌లో నదీగర్భంలో నడిచే తొలి మెట్రో రైలు.. దీని ప్రత్యేకతలు ఏమిటో తెలుసా?

కోల్‌క‌తా ఈస్ట్ - వెస్ట్ మెట్రో కారిడార్ పరిధిలో దాదాపు రూ. 120 కోట్ల వ్యయంతో  హుంగ్లీ నదీగర్భంలో ఈ సొరంగ రైలు మార్గాన్ని నిర్మించారు.

Underwater Metro : భార‌త్‌లో నదీగర్భంలో నడిచే తొలి మెట్రో రైలు.. దీని ప్రత్యేకతలు ఏమిటో తెలుసా?

Underwater Metro

Narendra Modi : పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో నీటి అడుగు నడిచే మెట్రో రైలు పరుగులు పెట్టేందుకు సిద్ధమైంది. దేశంలోనే తొలిసారిగా నిర్మించిన అండర్ వాటర్ మెట్రో టన్నెల్ మార్గాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ప్రారంభించనున్నారు. ఈ సొరంగ రైలు మార్గాన్ని హుగ్లీ నది గర్భంలో నిర్మించారు. అయితే, నదిలో ఈ మెట్రోరైలు మార్గం ఎంతదూరం విస్తరించి ఉంది? నదీ కింద ఎన్ని మీటర్లలోతులో దీనిని నిర్మించారు? దీనిలో ఎన్ని స్టేషన్లు ఉన్నాయి? ఒకవేళ మెట్రో రైలు మధ్యలో ఆగితే పరిస్థితి ఏమిటి? వంటి విషయాలను ప్రజల్లో ఆసక్తిరేపుతున్నాయి.

Also Read : YouTube Create App : భారతీయ యూట్యూబ్ క్రియేటర్లకు గుడ్‌ న్యూస్.. ఈ యాప్ ద్వారా మీ మొబైల్ నుంచే వీడియోలను ఎడిట్ చేసుకోవచ్చు!

  • నదీగర్భంలో రైలు మార్గం విశేషాలు..
  • కోల్ కతా ఈస్ట్ – వెస్ట్ మెట్రో కారిడార్ కింద దాదాపు రూ. 120 కోట్ల వ్యయంతో  ఈ సొరంగ రైలు మార్గాన్ని హుంగ్లీ నదీగర్భంలో నిర్మించారు.
  • కోల్ కతా ఈస్ట్ – వెస్ట్ మెట్రో మార్గం పొడవు మొత్తం 16.6 కిలో మీటర్లు. ఇందులో 10.8 కిలో మీటర్లు భూగర్భంలో ఉంటుంది.
  • హావ్‌డా మైదాన్ నుంచి ఎస్‌ప్లెనెడ్‌ స్టేషన్ల మధ్య 4.8 కిలో మీటర్ల మేర ఉన్న లైనులో భాగంగా 520 మీటర్ల పొడవైన అండర్ వాటర్ మెట్రో టన్నెల్ నిర్మించారు.
  • నదీగర్భానికి 16 మీటర్ల దిగువన, భూమిలో లోపలికి 32 మీటర్ల లోతులో దీన్ని నిర్మించారు.
  • ప్రస్తుతం హావ్‌డా నుంచి సీల్దాకు రోడ్డు మార్గంలో వెళ్లాలంటే 90 నిమిషాల సమయం పడుతుంది.
  • అండర్ వాటర్ మెట్రో మార్గం ద్వారా ఈ ప్రయాణం 40 నిమిషాలకు తగ్గుతుంది.
  • ఆటోమేటిక్ ట్రైన్ ఆపరేషన్ (ATO) సిస్టమ్ ద్వారా మెట్రో నడుస్తుంది. అంటే మెట్రో డ్రైవర్ ఒక బటన్ నొక్కిన తర్వాత, రైలు ఆటోమేటిక్‌గా తదుపరి స్టేషన్‌కు చేరుకుంటుంది.
  • ఈ మెట్రో రైలు కారిడార్ పరిధిలో ఆరు స్టేషన్లు కలిగి ఉంటుంది. అయితే, మూడింటిని నదీగర్భంలోనే కట్టారు.
  • ప్రయాణికులు నదీగర్భం లోపలికి, బయటకు వేగంగా వచ్చిపోయేందుకు వీలుగా నిర్మించారు.
  • పలుసార్లు మెట్రో సేవలకు అంతరాయం ఏర్పడుతుండటం మనం చూస్తూనే ఉన్నాం.
  • ఒకవేళ మెట్రో రైలులో సమస్య తలెత్తి నదీగర్భంలో ఆగిపోయినా భయాందోళన అవసరం లేదు. పక్కనే నిర్మించేందుకు నడక మార్గాన్ని కూడా వినియోగించుకోవచ్చు.
  • ప్రతీరోజూ కనీసం ఏదు లక్షల మంది ప్రయాణీకులు అండర్ వాటర్ మెట్రోలో ప్రయాణిస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.
  • ఈ ప్రాజెక్టు ద్వారా కోల్ కతాలో ట్రాఫిక్ రద్దీ, వాయుకాలుష్యం తగ్గే అవకాశం ఉంది.
  • ప్రపచంలో అనేక దేశాల్లో అండర్ వాటర్ రైల్వే ప్రయాణ సదుపాయం ఉంది.
  • జపాన్ లోని సీకెల్ టన్నెల్ ప్రఖ్యాతిగాంచిన అండర్ వాటర్ రైల్వే టన్నెల్. దీని పొడవు ఏకంగా 53.85 కిలో మీటర్లు.
  • తుర్కియేలోని ఇస్తాంబుల్ లో బోస్ఫోరన్ జలసంధి కింద అండర్వ వాటర్ టన్నెల్ నిర్మించారు. ఇది ఇస్తాంబుల్ లోని ఆసియా, యూరప్ భూభాగాలను కలుపుతుంది. దీని పొడవు 14 కిలో మీటర్లు.