Jammu and Kashmir : జమ్మూకశ్మీరులో ఎన్ కౌంటర్.. ఇద్దరు పాక్ ఉగ్రవాదుల హతం

జమ్మూకశ్మీరులోని సరిహద్దు నియంత్రణ రేఖ వద్ద గురువారం ఎదురుకాల్పులు జరిగాయి. కుప్వారాలోని నియంత్రణ రేఖ వెంబడి ఇద్దరు పాకిస్థాన్ ఉగ్రవాదులు చొరబాటుకు యత్నిస్తుండగా భారత సైనికులు కాల్పులు జరిపారు....

Jammu and Kashmir : జమ్మూకశ్మీరులో ఎన్ కౌంటర్.. ఇద్దరు పాక్ ఉగ్రవాదుల హతం

Infiltration Bid

Updated On : October 26, 2023 / 3:27 PM IST

Jammu and Kashmir : జమ్మూకశ్మీరులోని సరిహద్దు నియంత్రణ రేఖ వద్ద గురువారం ఎదురుకాల్పులు జరిగాయి. కుప్వారాలోని నియంత్రణ రేఖ వెంబడి ఇద్దరు పాకిస్థాన్ ఉగ్రవాదులు చొరబాటుకు యత్నిస్తుండగా భారత సైనికులు కాల్పులు జరిపారు. ఉత్తర కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలోని మచిల్ సెక్టార్‌లో కొనసాగుతున్న ఎన్‌కౌంటర్‌లో భద్రతా దళాలు ఇద్దరు పాక్ చొరబాటుదారులను హతమార్చాయని పోలీసులు గురువారం తెలిపారు.

Also Read :  బీజేపీ లీడర్ బీఎస్ యెడియూరప్పకు జడ్ కేటగిరి సెక్యూరిటీ

‘‘కుప్వారా పోలీసులు అందించిన నిర్దిష్ట సమాచారం ఆధారంగా మచల్ సెక్టార్‌లో ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది. ఈ ఎదురుకాల్పుల్లో ఇప్పటివరకు ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఆపరేషన్ జరుగుతోంది’’ అని జమ్మూకశ్మీర్ పోలీసులు ఎక్స్ లో రాశారు. అంతకుముందు ఉత్తర కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వెంబడి జమ్మూ కాశ్మీర్ పోలీసులతో కలిసి చొరబాటు ప్రయత్నాన్ని విఫలమైనట్లు భారత సైన్యం తెలిపింది.

Also Read :  వెలుగుచూసిన కన్నడ నటుడి పులిగోరు ఫొటోలు…అటవీశాఖ అధికారుల సోదాలు

అక్టోబర్ 26న భారత సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ప్రారంభించిన జాయింట్ ఆపరేషన్‌లో కుప్వారా సెక్టార్‌లోని నియంత్రణ రేఖ వెంబడి అప్రమత్తమైన దళాలు చొరబాటు ప్రయత్నాన్ని విఫలం చేశాయని శ్రీనగర్‌కు చెందిన చినార్ కార్ప్స్ ఎక్స్ పోస్ట్‌లో పేర్కొంది.

Also Read :  మెక్సికోలో ఓటిస్ హరికేన్ ముప్పు…వెరీ డేంజరస్

ఈ ఏడాది జమ్మూలో భద్రతా బలగాలు విఫలమైన 13వ చొరబాటు బిడ్. పాక్ ఉగ్రవాదులు గరిష్టంగా మచిల్ సెక్టార్, పూంచ్, రాజౌరి ప్రాంతాల్లో చొరబాటుకు యత్నించి విఫలమయ్యారు. గురువారం జరిగిన ఆపరేషన్‌లో ఇద్దరు మరణించడంతో మొత్తం 28 మంది పాక్ చొరబాటుదారులు మరణించారు.