దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై న్యాయ విచారణకు త్రిసభ్య కమిషన్ : సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్ కౌంటర్ పై న్యాయ విచారణకు ఆదేశించింది.

  • Published By: veegamteam ,Published On : December 12, 2019 / 06:48 AM IST
దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై న్యాయ విచారణకు త్రిసభ్య కమిషన్ : సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

Updated On : December 12, 2019 / 6:48 AM IST

దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్ కౌంటర్ పై న్యాయ విచారణకు ఆదేశించింది.

దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్ కౌంటర్ పై న్యాయ విచారణకు ఆదేశించింది. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో త్రిసభ్య కమిషన్ వేసింది. ఆరు నెలల్లో నివేదిక సమర్పించాలని కమిషన్ ను ఆదేశించింది.సుప్రీంకోర్టు మాజీ జడ్డి వీఎస్ సిర్పూర్ కర్ నేతృత్వంలో కమిషన్ వేసింది.

విచారణ కమిషన్ లో ముంబై హైకోర్టు మాజీ న్యాయమూర్తి రేఖా ప్రకాశ్, మాజీ సీబీఐ డైరెక్టర్ కార్తికేయన్ ఉన్నారు. త్రిసభ్య కమిషన్ కు సీఆర్ పీఎఫ్ భద్రత కల్పించారు. కమిషన్ ఖర్చులను తెలంగాణ ప్రభుత్వమే భరించాలని సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టులో దిశ నిందుతుల ఎన్ కౌంటర్ పై విచారణ సాగింది.

ఈ క్రమంలో పిటిషనర్ అడ్వకేట్జీ ఎస్ మణిని.. మీరెందుకు ఈ కేసుపై పిటిషన్ వేశారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు. దిశ కేసులో నిందితుల ఎన్ కౌంటర్ జరిగిన తీరు పూర్తిగా ఉద్ధేశపూర్వకంగా చేసినట్లుగా కనిపిస్తోందని జీఎస్ మణి తెలిపారు.

దీనికి సమాధానంగా ఈ కేసు విషయంలో పోలీసు ఉన్నతాధికారులతో సమగ్ర విచారణ జరిపిస్తున్నామని తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి ధర్మాసనానికి వివరించారు. ఎన్ కౌంటర్ పై సిట్ ఏర్పాటు చేశామని దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. ఈ కేసులో నిజా నిజాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని కోర్టు వ్యాఖ్యానించింది.

ఎన్ కౌంటర్ ఎటువంటి పరిస్థితుల్లో జరిగిందో.. ఎలా జరిగిందో.. ఎన్ కౌంటర్ లో మృతి చెందిన నలుగురు నిందితులు చెప్పలేరని తెలిపింది. దీనిపై నిష్పక్షపాతంగా విచారణ జరగాలని..అన్ని విషయాలను ప్రజలకు వివరించాల్సిన అవసరముందని సుప్రీం కోర్టు తెలిపింది.