First Phase of LS polls 2024 : లోక్సభ ఎన్నికల ప్రక్రియ.. తొలిదశ ఎన్నికలకు నోటిఫికేషన్ ఎప్పుడంటే?
First Phase of LS polls 2024 : ఎన్నికల సంఘం వివరాల ప్రకారం.. మార్చి 20న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. తొలి దశ ఎన్నికకు సంబంధించి ఆయా లోక్సభ నియోజకవర్గాల్లో నామినేషన్ల సందడి ప్రారంభం కానుంది.

Nominations for first phase of LS polls in UP to begin on March 20, 2024
First Phase of LS polls 2024 : దేశంలో లోక్సభ ఎన్నికల ప్రక్రియ మొదలుకానుంది. ఎన్నికల సంఘం వివరాల ప్రకారం.. తొలిదశ పోలింగ్కు సంబంధించి బుధవారం (మార్చి 20న) నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇందులో భాగంగా తొలి దశ ఎన్నికకు సంబంధించి ఆయా లోక్సభ నియోజకవర్గాల్లో నామినేషన్ల సందడి ప్రారంభం కానుంది. మొత్తం 7 దశల్లో పోలింగ్ జరుగనుంది. మొదటి విడతలో మొత్తం 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 102 స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి.
లోక్సభ ఎన్నికల షెడ్యూల్ :
ఎన్నికల సంఘం ప్రకారం.. తొలి దశకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. అయితే, నామినేషన్ల దాఖలుకు మార్చి 27 చివరి తేదీ కాగా.. మార్చి 28న నామినేషన్ల పరిశీలన, అభ్యర్థిత్వ ఉపసంహరణకు చివరి తేదీ మార్చి 30, పోలింగ్ తేదీ ఏప్రిల్ 19న, ఓట్ల లెక్కింపు జూన్ 4న జరుగనుంది. పశ్చిమ బెంగాల్, యూపీ, బీహార్ 3 రాష్ట్రాలు, మొత్తం 7 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి.
ఏప్రిల్ 19న 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో 102 నియోజకవర్గాలకు మొదటి దశ ఎన్నికలు జరుగుతాయని ఈసీ తెలిపింది. మిగిలిన దశలు ఏప్రిల్ 26, మే 7, మే 13, మే 20, మే 25, జూన్ 1 తేదీలలో జరుగుతాయి. 102 నియోజకవర్గాల్లో అత్యధిక పార్లమెంటరీ స్థానాలకు పోలింగ్ జరుగనుంది. రెండో దశలో 89 స్థానాలు, మూడో దశలో 94 స్థానాలు, నాలుగో దశలో 96 స్థానాలు, ఐదో దశలో 49 స్థానాలు, 6వ దశలో 57 స్థానాలు, ఏడో దశలో 57 స్థానాల్లో పోలింగ్ జరుగనుంది.
యూపీలో 8 స్థానాలకు ఏప్రిల్ 19న ఎన్నిక :
ఉత్తరప్రదేశ్లో పార్లమెంట్ ఎన్నికల తొలి దశ నామినేషన్ల ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభం కానుందని ఎన్నికల అధికారి తెలిపారు. యూపీలోని 8 పార్లమెంటరీ నియోజకవర్గాలైన సహారన్పూర్, కైరానా, ముజఫర్నగర్, బిజ్నోర్, నగీనా (SC), మొరాదాబాద్, రాంపూర్, పిలిభిత్లో ఏప్రిల్ 19న మొదటి దశ లోక్సభ ఎన్నిక జరుగనుంది.
ఈసారి ఒంటరిగానే బీఎస్పీ పోటీ :
ఈసారి బహుజన్ సమాజ్ పార్టీ (BSP) ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ, కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంది. రెండు పార్టీలు ప్రతిపక్ష ఇండియా కూటమిలో భాగమయ్యాయి. బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్తో రాష్ట్రీయ లోక్ దళ్ చేతులు కలిపింది.
మొదటి దశలో ఏ రాష్ట్రాల్లో ఎన్ని స్థానాలంటే? :
- అరుణాచల్ ప్రదేశ్ (2)
- అస్సాం (5)
- బీహార్ (4)
- ఛత్తీస్గఢ్ (1)
- మధ్యప్రదేశ్ (6)
- మహారాష్ట్ర (5)
- మణిపూర్ (2)
- మేఘాలయ (2)
- మిజోరం (1)
- నాగాలాండ్ (1)
- రాజస్థాన్ (12)
- సిక్కిం (1)
- తమిళనాడు (39)
- త్రిపుర (1)
- ఉత్తరప్రదేశ్ (8)
- ఉత్తరాఖండ్ (5)
- పశ్చిమ బెంగాల్ (3)
- అండమాన్, నికోబార్ దీవులు (1)
- జమ్మూ కాశ్మీర్ (1)
- లక్షద్వీప్ (1)
- పుదుచ్చేరి (1)
Read Also : Telangana Congress : ఎన్నికల వేళ కాంగ్రెస్లో పదవుల చిచ్చు.. సీనియర్లు సీరియస్