Maharashtra : ఫేస్ బుక్ లో పరిచయమైన బాలికను నిర్బంధించి… రెండేళ్లుగా ఆమెపై లైంగిక దాడి

ఒక ఫోన్ లోని మొబైల్ నెంబర్ కు కాంటాక్ట్ చేశారు. మాట్లాడిన వ్యక్తి తన పేరు షేక్ అని తెలిపారు. ఆ బాలిక తన వద్ద ఉందని పేర్కొన్నారు.

Maharashtra : ఫేస్ బుక్ లో పరిచయమైన బాలికను నిర్బంధించి… రెండేళ్లుగా ఆమెపై లైంగిక దాడి

man assaulted girl

Updated On : June 1, 2023 / 9:41 PM IST

man assaulted girl : మహారాష్ట్రలోని లాతూర్ లో దారుణం జరిగింది. ఫేస్ బుక్ లో పరిచయమైన బాలికను ఓ వ్యక్తి నిర్బంధించి రెండేళ్లుగా ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అతడు ఉన్న ప్రాంతాన్ని గుర్తించిన పోలీసులు చివరకు ఆ బాలికను రక్షించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఔరద్ షాజనీ ప్రాంతానికి చెందిన మనుద్దీన్ బాదురేకు ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ కు చెందిన 11 ఏళ్ల బాలికతో ఫేస్ బుక్ లో పరిచయం ఏర్పడింది.

దీంతో అతడు గోరఖ్ పూర్ కు వచ్చి గత కొంతకాలంగా ఉంటున్నాడు. ఈ క్రమంలో ఆ బాలికను లోబర్చుకున్నాడు. 2021 డిసెంబర్ 24న ఆమెను లాతూర్ లోని తన ప్రాంతానికి రప్పించాడు. కాగా, బాలిక కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఆమె గదిలోని వస్తువులను తనిఖీ చేయగా రెండు మొబైల్ ఫోన్లు కనిపించాయి.

Dharmavaram : భార్య లాంగ్ చైన్ మింగేసిన భర్త.. మూడు నెలలుగా కడుపులోనే.. చివరికి ఏం జరిగిందంటే?

ఒక ఫోన్ లోని మొబైల్ నెంబర్ కు కాంటాక్ట్ చేశారు. మాట్లాడిన వ్యక్తి తన పేరు షేక్ అని తెలిపారు. ఆ బాలిక తన వద్ద ఉందని పేర్కొన్నారు. తిరిగి ఇంటికి రాదని, ఆమె గురించి మరిచిపోవాలని కుటుంబ సభ్యులను హెచ్చరించారు. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఉత్తరప్రదేశ్ పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సదరు బాలిక కోసం ఏడాదిన్నర కాలం పాటు ప్రయత్నించారు. ఆమెను బంధించిన వ్యక్తి మహారాష్ట్రలోని లాతూర్ లో ఉన్నట్లు మొబైల్ నెంబర్, సాంకేతిక ఆధారాల ద్వారా గుర్తించారు. దీంతో యూపీ పోలీసులు ఇటీవల అదే ప్రాంతానికి వెళ్లారు.

Nampally Court : జైలుకు వెళ్లనంటూ నాంపల్లి కోర్టులో నిందితుడు హల్ చల్

ఏడాదిన్నరకు పైగా బాలికను నిర్బంధించిన మనుద్దీన్ ను అరెస్టు చేశారు. అతడి చెరలో ఉన్న బాలికను రక్షించారు. వారిద్దరినీ గోరఖ్ పూర్ కు తీసుకొచ్చారు. రెండేళ్లుగా బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు సదరు వ్యక్తి పోలీసులకు తెలిపాడు. దీంతో పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టంతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.