Sonam Wangchuk : సోనమ్ వాంగ్చుక్ ఎవరు? త్రి ఇడియట్స్ ఆమీర్ ఖాన్ రోల్ ఈయనదే.. లడఖ్లో హింస మధ్య 15 రోజుల నిరాహార దీక్ష విరమణ!
Sonam Wangchuk : లడఖ్లో హింస మధ్య, సోనమ్ వాంగ్చుక్ తన నిరాహార దీక్షను విరమించుకున్నారు. హింసను ఆపాలని యువతకు ఆయన విజ్ఞప్తి చేశారు.

Sonam Wangchuk
Sonam Wangchuk : లడఖ్ రాజధాని లేహ్లో హింసతో నిండిన రోజు. విద్యార్థులు, యువత చేసిన ప్రదర్శనలు హింసాత్మకంగా మారాయి. నలుగురు మరణించారు. డజన్ల కొద్దీ గాయపడ్డారు. ఈ నిరసన సందర్భంగా లడఖ్కు పూర్తి రాష్ట్ర హోదా కోసం చాలా కాలంగా ప్రయత్నిస్తున్న పర్యావరణ ఆవిష్కర్త సోనమ్ వాంగ్చుక్.. హింసకు బాధగా తన 15 రోజుల నిరాహార దీక్షను విరమించుకున్నాడు.
శాంతిని కాపాడుకోవాలని సోనమ్ వాంగ్చుక్ (Sonam Wangchuk) ప్రజలకు విజ్ఞప్తి చేశారు. లడఖ్లో చెలరేగిన హింస మధ్య, వాతావరణ కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ మరోసారి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ఇంతకీ సోనమ్ వాంగ్చుక్ ఎవరో వివరంగా తెలుసుకుందాం.
మీరు 3 ఇడియట్స్ చూశారా? అందులో విద్యావ్యవస్థపై పోరాడిన అసాధారణ మేధావి ఫున్సుఖ్ వాంగ్డు పాత్ర గురించి గుర్తుండే ఉంటుంది. ఈ పాత్ర బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ చేశాడు. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే.. ఆ పాత్ర కేవలం మూవీ కల్పితం కాదు.. లడఖి ఇంజనీర్, ఆవిష్కర్త, ఇప్పుడు మాతృభూమి రాజకీయ పోరాటంలో ఒకరైన సోనం వాంగ్చుక్ నుంచి ప్రేరణ పొందింది. 1966లో జన్మించిన ఆయన విద్యా రంగంలో సంస్కరణల కోసం SECMOL అనే సంస్థను స్థాపించారు.
భారత సైనికులకు చాలా ప్రయోజనకరంగా నిరూపించిన మంచు స్థూపాల నిర్మాణంతో సహా భారత సైన్యం కోసం సోనమ్ అనేక ఆవిష్కరణలను కూడా సృష్టించారు. లడఖ్లో కొనసాగుతున్న విద్యా సంస్కరణలకు ఆయన ప్రసిద్ధి చెందారు. స్థానిక అవసరాలు, పర్యావరణ అనుకూల పద్ధతులకు అనుగుణంగా లడఖ్లోని విద్యార్థులకు విద్య, శిక్షణను అందించే హిమాలయన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్, లడఖ్తో కూడా ఆయనకు సంబంధం ఉంది.
విద్య, ఆవిష్కరణ రంగాలలో అగ్రగామిగా వాంగ్చుక్, లడఖ్కు పూర్తి రాష్ట్ర హోదాను డిమాండ్ చేసి రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్గా మారాడు. తదనంతరం ఆయన 3 ప్రాథమిక డిమాండ్లపై దృష్టి సారించి ఉద్యమాన్ని ముందుకు నడిపించారు. అందులో మొదటిది, లడఖ్కు పూర్తి రాష్ట్ర హోదా ఇవ్వడం. రెండవది, రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్ కింద లడఖ్కు రాజ్యాంగ రక్షణ కల్పించడం. మూడవది ప్రాంతీయ వనరులు, ఉద్యోగాలు, స్థానిక స్వయంప్రతిపత్తికి హామీ ఇవ్వడం వంటివి ఉన్నాయి.
ఈ అంశంపై ఆయన గతంలో అనేక నిరాహార దీక్షలు నిర్వహించారు. ఆయన ఒకసారి తన మద్దతుదారులతో కలిసి ఢిల్లీ వరకు పాదయాత్ర చేపట్టారు. ప్రస్తుతం ఆయన 35 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. అయితే, 15వ రోజు నిరాహార దీక్ష హింసాత్మకంగా మారింది. లేహ్లో నిరసనకారులు, పోలీసుల మధ్య ఘర్షణలు చెలరేగాయి. భారతీయ జనతా పార్టీ కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని నిప్పంటించారు. నలుగురు వ్యక్తులు మరణించినట్లు సమాచారం. హింస నేపథ్యంలో వాంగ్చుక్ తన సమ్మెను విరమించుకుని, యువత శాంతిని కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశారు.