PM Modi : నేడు ధ్యాన్ చంద్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి శంకుస్థాపన
ప్రధాని మోదీ నేడు ధ్యాన్ చంద్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేయనున్నారు. యూపీలోని మీరట్లో రూ.700 కోట్ల అంచనా వ్యయంతో ఈ యూనివర్సిటీ నిర్మాణం జరగనుంది.

Pm Modi
PM Modi : ప్రధాని మోదీ నేడు ఉత్తరప్రదేశ్లో పర్యటించనున్నారు. యూపీ ఎన్నికలకు మరో నెలరోజుల సమయం మాత్రమే ఉండటంతో ప్రధాని మోదీ విస్తృతంగా పర్యటిస్తున్నారు. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇక ఆదివారం ప్రధాని మోదీ యూపీలోని మీరట్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ మధ్యాహ్నం 1 గంటలకు మేజర్ ధ్యాన్ చంద్ స్టార్ట్స్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేయనున్నారు. సర్ధానా పట్టణంలోని సలావా – కైలీ గ్రామాలలో సుమారు రూ. 700 కోట్ల అంచనా వ్యయంతో మేజర్ ధ్యాన్ చంద్ స్పోర్ట్స్ యూనివర్సిటీని స్థాపించనున్నారు.
చదవండి : PM Modi: అభివృద్ధి శిఖరాలను అధిరోహిస్తూనే ఉంటాం – ప్రధాని మోదీ
ఈ యూనివర్సిటీలో సింథటిక్ హాకీ గ్రౌండ్, ఫుట్బాల్ గ్రౌండ్, బాస్కెట్బాల్, వాలీబాల్, హ్యాండ్బాల్, కబడ్డీ గ్రౌండ్, లాన్ టెన్నిస్ కోర్ట్, జిమ్నాసియం హాల్, సింథటిక్ రన్నింగ్ స్టేడియం, స్విమ్మింగ్ పూల్, మల్టీపర్పస్ వంటి ఆధునిక, అత్యాధునిక క్రీడా మౌలిక సదుపాయాలతో ఈ క్రీడా విశ్వవిద్యాలయం ఉంటుంది. హాల్, సైక్లింగ్ వెలోడ్రోమ్ లాంటివి కూడా దీనిలో ఉండనున్నాయి. ఒకేచోట 540 మంది మహిళలు, 540 మంది పురుష క్రీడాకారులతో సహా మొత్తం 1080 మంది క్రీడాకారులకు శిక్షణనిచ్చే విధంగా ఈ యూనివర్సిటీని స్థాపించనున్నారు.
చదవండి : PM Modi UAE Tour : ఒమిక్రాన్ ఎఫెక్ట్.. ప్రధాని మోదీ యూఏఈ పర్యటన రద్దు