మా పాలన మెచ్చి మళ్లీ పట్టం : యూపీఏలా పని చేయలేము

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని మోడీ లోక్ సభలో మాట్లాడారు. ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వమే కాదు పాలనలోనూ మార్పును ప్రజలు

  • Published By: veegamteam ,Published On : February 6, 2020 / 07:35 AM IST
మా పాలన మెచ్చి మళ్లీ పట్టం : యూపీఏలా పని చేయలేము

Updated On : February 6, 2020 / 7:35 AM IST

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని మోడీ లోక్ సభలో మాట్లాడారు. ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వమే కాదు పాలనలోనూ మార్పును ప్రజలు

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని మోడీ లోక్ సభలో మాట్లాడారు. ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వమే కాదు పాలనలోనూ మార్పును ప్రజలు కోరుకున్నారని, అందుకే తమకు పట్టం కట్టారని ప్రధాని చెప్పారు. అయోధ్యపై సుప్రీంకోర్టు తీర్పుని ప్రధాని కొనియాడారు. సమయంతో పోటీ పడి పని చేస్తున్నామని చెప్పారు. ప్రతిపక్షాల 70 ఏళ్ల పాలన దారుణంగా సాగిందన్నారు. యావత్ ప్రపంచం భారత్ వైపు చూస్తోందన్నారు.

యూపీఏలా మేము పని చేయలేము అని ప్రధాని న్నారు. ట్రిపుల్ తలాక్ రద్దుతో ముస్లిం మహిళలకు భద్రత కల్పించామన్నారు. ఆర్టికల్ 370 రద్దు చేశామన్నారు. ప్రతిపక్షాల మాదిరి ఆలోచిస్తే రామ మందిరం వివాదం ఇప్పటికీ కొనసాగేదన్నారు. సవాళ్లపై వెనకడుగు వేస్తే అలానే ఉండిపోతామన్నారు. మా ఐదేళ్ల పాలన మెచ్చి ప్రజలు మళ్లీ పట్టం కట్టారని ప్రధాని చెప్పారు.

13 కోట్ల పేదల ఇళ్లలో గ్యాస్ వెలుగులు నింపామని ప్రధాని మోడీ అన్నారు. ఐదేళ్లలో ఢిల్లీని ఈశాన్య ప్రజలకు చేరువ చేశామన్నారు. ఎన్నో చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నామన్నారు. చాలా కాలంగా దేశాన్ని సమస్యలు వేధిస్తున్నాయన్న ప్రధాని మోడీ.. వాటికి పరిష్కారాలను చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు. కాంగ్రెస్ బాటలో వెళ్లి ఉంటే ట్రిపుల్ తలాక్ కొనసాగేదన్నారు ప్రధాని మోడీ.