ISRO Heroes : బెంగళూరులో ఇస్రో హీరోలను కలవనున్న ప్రధాని మోదీ
చంద్రయాన్-3 మిషన్లో పాల్గొన్న శాస్త్రవేత్తలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ కలవనున్నారు. చంద్రుడిపై చంద్రయాన్ -3 అంతరిక్ష నౌక విజయవంతంగా అడుగిడటంతో ప్రధాని మోదీ ఇస్రో హీరోలను కలిసేందుకు ఈ నెల 26వతేదీన బెంగళూరు రానున్నారు....
![ISRO Heroes : బెంగళూరులో ఇస్రో హీరోలను కలవనున్న ప్రధాని మోదీ ISRO Heroes : బెంగళూరులో ఇస్రో హీరోలను కలవనున్న ప్రధాని మోదీ](https://10tv.in/wp-content/uploads/2023/08/PM-Modi-to-meet-Isro-heroes.gif)
PM Modi to meet Isro heroes
Isro Heroes : చంద్రయాన్-3 మిషన్లో పాల్గొన్న శాస్త్రవేత్తలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ కలవనున్నారు. చంద్రుడిపై చంద్రయాన్ -3 అంతరిక్ష నౌక విజయవంతంగా అడుగిడటంతో ప్రధాని మోదీ ఇస్రో హీరోలను కలిసేందుకు ఈ నెల 26వతేదీన బెంగళూరు రానున్నారు. (PM Modi to meet Isro heroes) విజయవంతమైన చంద్రయాన్-3 మిషన్ వెనుక ఉన్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలను ప్రధాని నరేంద్ర మోదీ భేటీ కానున్నారు.
Chandrayaan-3 : చంద్రుడిపై నడచిన భారత్…ఇస్రో ట్వీట్
చంద్రయాన్ ల్యాండింగ్ సందర్భంగా ప్రధాని మోదీ బ్రిక్స్ (బ్రెజిల్-రష్యా-భారత్-చైనా-దక్షిణాఫ్రికా) సదస్సులో పాల్గొనేందుకు ప్రస్తుతం జోహన్నెస్బర్గ్లో ఉన్నారు. (Bengaluru on August 26) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం సాయంత్రం ఫోన్ కాల్ ద్వారా ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్కు శుభాకాంక్షలు తెలిపారు. చంద్రుని దక్షిణ ఉపరితలంపై చంద్రయాన్-3 చారిత్రాత్మక సాఫ్ట్-ల్యాండింగ్ తర్వాత మోదీ దీన్ని కొత్త శకానికి నాంది అని కొనియాడారు.