ఈ ప్రభుత్వం మేల్కొనేలోపు ఇంకా ఎన్ని కుటుంబాలు నాశనం కావాలి?: రాహుల్ గాంధీ
మైసూరు-దర్భంగా రైలు ప్రమాదం ఇంతకుముందు చోటుచేసుకున్న బాలాసోర్ ఘోర ప్రమాదానికి అద్దం పడుతోందని చెప్పారు.

Rahul Gandhi
కేంద్రప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. తమిళనాడులో భాగమతి ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. దీంతో 19 మందికి గాయాలయ్యాయి. దీనిపై రాహుల్ గాంధీ స్పందించారు.
“మైసూరు-దర్భంగా రైలు ప్రమాదం ఇంతకుముందు చోటుచేసుకున్న బాలాసోర్ ఘోర ప్రమాదానికి అద్దం పడుతోంది. ఒక ప్యాసింజర్ రైలు వచ్చి ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టింది. ఎన్నో ప్రమాదాల్లో ఎంతో మంది మృతి చెందినప్పటికీ గుణపాఠాలు నేర్చుకోలేదు. నాయకులకు జవాబుదారీతనం ఉండాలి.
ఈ ప్రభుత్వం మేల్కొనేలోపు ఇంకా ఎన్ని కుటుంబాలు నాశనం కావాలి?” అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. కాగా, ఈ రైలు ప్రమాదంలో ప్రయాణికులు ఎవరూ మృతి చెందలేదని దక్షిణ రైల్వే ప్రకటించింది. ఈ ప్రమాదం జరిగినప్పుడు ముందుభాగంలో అన్నీ ఏసీ కోచ్లే ఉండటంతో అందులోని ప్రయాణికులు మాత్రమే గాయపడ్డారని సమాచారం.
The Mysuru-Darbhanga train accident mirrors the horrific Balasore accident—a passenger train colliding with a stationary goods train.
Despite many lives lost in numerous accidents, no lessons are learned. Accountability starts at the top. How many more families must be… https://t.co/ggCGlgCXOE
— Rahul Gandhi (@RahulGandhi) October 12, 2024
జగనాసురుడి దుష్టపాలనను జనమే అంతమొందించారు.. విజయదశమి శుభాకాంక్షలు: నారా లోకేశ్