Jammu and Kashmir : మసీదు వద్ద రిటైర్డు పోలీసు అధికారిపై ఉగ్రవాదుల కాల్పులు…మృతి

జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి కాల్పులకు తెగబడ్డారు. బారాముల్లా జిల్లాలో రిటైర్డ్ సీనియర్ పోలీసు అధికారి ఆదివారం మసీదులో ప్రార్థనలు చేస్తున్నప్పుడు ఉగ్రవాదులు కాల్చి చంపారు.....

Jammu and Kashmir : మసీదు వద్ద రిటైర్డు పోలీసు అధికారిపై ఉగ్రవాదుల కాల్పులు…మృతి

Retired senior cop shot dead

Updated On : December 24, 2023 / 10:17 AM IST

Jammu and Kashmir : జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి కాల్పులకు తెగబడ్డారు. బారాముల్లా జిల్లాలో రిటైర్డ్ సీనియర్ పోలీసు అధికారి ఆదివారం మసీదులో ప్రార్థనలు చేస్తున్నప్పుడు ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఉగ్రవాదుల కాల్పుల ఘటన అనంతరం పోలీసు బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. షీరీ బారాముల్లాలోని గంట్ముల్లాలో రిటైర్డ్ పోలీసు అధికారి అయిన మహ్మద్ షఫీ మసీదులో అజాన్ ప్రార్థనలు చేస్తుండగా తీవ్రవాదులు కాల్పులు జరిపారు.

ALSO READ : 2024 Lok Sabha elections : వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 50 శాతం ఓటు షేర్ లక్ష్యంగా బీజేపీ క్లస్టర్ సమావేశాలు

ఈ కాల్పుల్లో గాయాలపాలైన షఫీ మరణించారు. ఈ ఘటనపై కశ్మీర్ జోన్ పోలీసులు ఎక్స్ లో పోస్టు పెట్టారు. గత నెలలో శ్రీనగర్‌లోని ఈద్గా మసీదు సమీపంలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో రాష్ట్ర పోలీసు ఇన్‌స్పెక్టర్‌ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన అనంతరం అతడిని సమీపంలోని ఆస్పత్రిలో చేర్పించారు.

ALSO READ : Ayodhya : అయోధ్యలో విమానాశ్రయం, రైల్వేస్టేషన్లను ప్రారంభించనున్న ప్రధాని మోదీ

శ్రీనగర్‌లోని ఈద్గా మైదానంలో ఇన్‌స్పెక్టర్ మస్రూర్ అహ్మద్ వానీ స్థానిక యువకులతో క్రికెట్ ఆడుతుండగా ఈ ఘటన జరిగింది. జమ్మూకశ్మీరులో తరచూ ఉగ్రవాదుల కదలికలు పెరిగాయి. ఉగ్రవాదుల చొరబాట్లతోపాటు వారి సంచారం పెరగడంతో కేంద్ర భద్రతా బలగాలు జమ్మూకశ్మీర్ పోలీసులతో కలిసి గాలింపును ముమ్మరం చేశాయి.