జమ్మూకశ్మీర్ లో ఎన్ కౌంటర్…ఉగ్రవాది హతం
జమ్మూకశ్మీర్ రాష్ట్రంలోని షోపియాన్ జిల్లాలో ఇవాళ(మే-10,2019)ఉదయం భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో ఓ ఉగ్రవాది మరణించినట్లు పోలీస్ ప్రతినిధి తెలిపారు.ఎన్ కౌంటర్ జరిగిన స్థలంలో తుపాకులు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఉగ్రవాది మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. అయితే మృతిచెందిన ఉగ్రవాది ఐడెంటిటీ, ఏ గ్రూప్ కి చెందినవాడో గుర్తించే పనిలో ఉన్నట్లు ఆయన తెలిపారు.
In a brief exchange of #fire, 01 #terrorist killed in #Shopian. Arms & ammunition recovered. Identity & #affiliation being ascertained. Information is #preliminary in nature. @JmuKmrPolice @Sandeep_IPS_JKP
— Kashmir Zone Police (@KashmirPolice) May 10, 2019