Chhattisgarh: ప్రధాని సభకు వెళ్తుండగా ప్రమాదానికి గురైన బస్సు.. స్పాట్‭లోనే ముగ్గురు మృతి

ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం తీవ్రంగా దెబ్బతిన్నది. కాగా, ముందు వరుసల్లో కూర్చున్న ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. మరో ఆరుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.

Chhattisgarh: ప్రధాని సభకు వెళ్తుండగా ప్రమాదానికి గురైన బస్సు.. స్పాట్‭లోనే ముగ్గురు మృతి

Updated On : July 7, 2023 / 12:30 PM IST

Bus Accident in Chhattisgarh: ప్రధానమంత్రి నరేంద్రమోదీ సభకు వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురి కావడంతో ముగ్గురు ప్రయాణికులు మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఛత్తీస్‭గఢ్ రాష్ట్రం బిలాస్‭పూర్‭లో ఉదయం జరిగిన దారుణ ప్రమాదమిది. శుక్రవారం రాష్ట్ర రాజధాని రాయ్‭పూర్‭లో ప్రధాని సభ ఉంది. అయితే ఈ సభకు రాష్ట్రంలోని నలుమూలల నుంచి బీజేపీ కార్యకర్తలు, మద్దతుదారులు, ప్రజలు వివిధ మార్గాల ద్వారా వస్తున్నారు. ఇందులో భాగంగా అంబికాపూర్ నుంచి రాయ్‭పూర్‭కు వస్తున్న ఒక బస్సు బిలాస్‭పూర్‭ సమీపంలోని బెల్తారాకు చేరుకోగానే ముందు వెళ్తున్న ఒక టిప్పర్ లారీని ఢీకొట్టింది.

Manipur Violence: మణిపూర్ విషయంలో కలుగజేసుకుంటామన్న అమెరికా.. మీ వ్యవహారాల్లో వేలు పెట్టలేదంటూ చురకలు అంటించిన కాంగ్రెస్ నేత

ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం తీవ్రంగా దెబ్బతిన్నది. కాగా, ముందు వరుసల్లో కూర్చున్న ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. మరో ఆరుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం బిలాస్‭పూర్‭లోని ఆసుపత్రికి తరలించినట్లు స్థానిక పోలీసు వర్గాలు వెల్లడించాయి. మిగిలిన ప్రయాణికులకు వేరే వాహనం ఏర్పాటు చేసి స్వగ్రమానికి తరలించారు.