Train Derail : రాజస్థాన్‌లో పట్టాలు తప్పిన ఎక్స్‌ప్రెస్ రైలు

రాజస్థాన్‌ రాష్ట్రంలోని కోటాలో శుక్రవారం సాయంత్రం భోపాల్‌కు వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలు రెండు బోగీలు పట్టాలు తప్పాయి. జోధ్‌పూర్-భోపాల్ ఎక్స్‌ప్రెస్ రెండు కోచ్‌లు పట్టాలు తప్పాయని, ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని రైల్వే అధికారులు చెప్పారు.....

Train Derail : రాజస్థాన్‌లో పట్టాలు తప్పిన ఎక్స్‌ప్రెస్ రైలు

Train Derail

Train Derail : రాజస్థాన్‌ రాష్ట్రంలోని కోటాలో శుక్రవారం సాయంత్రం భోపాల్‌కు వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలు రెండు బోగీలు పట్టాలు తప్పాయి. జోధ్‌పూర్-భోపాల్ ఎక్స్‌ప్రెస్ రెండు కోచ్‌లు పట్టాలు తప్పాయని, ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని రైల్వే అధికారులు చెప్పారు. రైలు నంబర్ 14813, జోధ్‌పూర్-భోపాల్ ఎక్స్‌ప్రెస్ యొక్క రెండు కోచ్‌లు కోట జంక్షన్ యార్డులో పట్టాలు తప్పాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

ALSO READ : Kapu Ramachandra Reddy : వైసీపీకి బిగ్ షాక్..

కోటా డివిజన్‌లోని డివిజనల్ రైల్వే మేనేజర్ ప్రయాణికుల కోసం అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్‌లను కూడా విడుదల చేశారు. ‘‘కోటా జంక్షన్ సమీపంలో భోపాల్ వెళుతున్న ప్యాసింజర్ రైలు రెండు బోగీలు పట్టాలు తప్పాయి, రెస్క్యూ ఆపరేషన్‌ సాగుతోంది’’ అని రైల్వే అధికారులు చెప్పారు. అంతకుముందు డిసెంబర్ 2023లో రాజస్థాన్‌లోని బికనీర్ జిల్లాలో ఖాళీ రైలు పట్టాలు తప్పింది.

ALSO READ : రాజకీయాలకు జగన్ పనికిరారు, వైసీపీని ఇంటికి పంపాలి ఏపీని కాపాడుకోవాలి- చంద్రబాబు

ఈ ప్రమాదంలో ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం. ఈ సంఘటన బికనీర్‌లోని లాల్‌ఘర్ రైల్వే స్టేషన్‌లో జరిగింది. రైలు పట్టాలు తప్పడానికి కారణాలు తెలియలేదు. రైల్వే అధికారులు రైలు మార్గంలో మరమ్మతులు చేస్తున్నారు.