Yogi Adityanath: బాబ్రీ మసీద్ పునర్ నిర్మాణంపై సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు
కొంతమంది సంక్షోభ సమయాల్లో మాత్రమే రాముడిని గుర్తుంచుకుంటారని, లేకపోతే మరిచిపోతారని, రాముడు కూడా అలాంటి వారిని మరిచిపోయాడని అన్నారు.
Yogi Adityanath Representative Image (Image Credit To Original Source)
- కాషాయ జెండా సనాతన చిహ్నం
- దేశ గౌరవాన్ని పెంచుతూనే ఉంటుంది
- రాముని లక్ష్యాన్ని అడ్డుకునే వారికి ఇక చోటు లేదు
Yogi Adityanath: బాబ్రీ మసీద్ పునర్ నిర్మాణంపై ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బాబ్రీ మసీద్ పునర్ నిర్మాణం ఎప్పటికీ జరగదని తేల్చి చెప్పారు. దీనికి భిన్నంగా ఊహించే వారి కలలు ఎప్పటికీ నెరవేరవని స్పష్టం చేశారు. బాబ్రీ మసీద్ పునర్ నిర్మాణ ప్రయత్నాలను అడ్డుకుంటామని ప్రకటించారు.
బారాబంకిలో జరిగిన బహిరంగ సభలో యోగి ఆదిత్యనాథ్ మాట్లాడారు. తన వాగ్దానాలను నెరవేర్చడంలో ప్రభుత్వం నిబద్ధతను పునరుద్ఘాటించారు. ఇది దాని పని పరిధిని మాత్రమే మాట్లాడుతుందని అన్నారు. అయోధ్యపై బీజేపీ వైఖరిని గుర్తు చేసుకుంటూ “మేము రామ్ లల్లా కోసం వస్తామని, అదే స్థలంలో ఆలయాన్ని నిర్మిస్తామని చెప్పాం, ఇందులో ఏదైనా సందేహం ఉందా?” అని అన్నారు.
దేశ వారసత్వం, అద్భుతమైన సంప్రదాయాలు, సనాతన ధర్మం పట్ల గౌరవాన్ని నొక్కి చెప్పారు. కాషాయ జెండా ఎల్లప్పుడూ దేశ గౌరవాన్ని పెంచుతూనే ఉంటుందని అన్నారు. అయోధ్యలోని శ్రీరామ ఆలయంలో ప్రధాని మోదీ ఎగురవేసిన కాషాయ జెండాను సనాతన చిహ్నంగా అభివర్ణించారు.
కొంతమంది సంక్షోభ సమయాల్లో మాత్రమే రాముడిని గుర్తుంచుకుంటారని, లేకపోతే మరిచిపోతారని, రాముడు కూడా అలాంటి వారిని మరిచిపోయాడని అన్నారు. రామ భక్తులపై కాల్పులు జరిపి, రాముని లక్ష్యాన్ని అడ్డుకునే వారికి ఇక చోటు లేదన్నారు.
శాంతిభద్రతలపై కఠినమైన సందేశం ఇచ్చారు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. ప్రజలు నిబంధనల ప్రకారం జీవించడం నేర్చుకోవాలని, చట్టాన్ని పాటించే వారు ప్రయోజనం పొందుతారని చెప్పారు. చట్టాన్ని పాటించని వారు నరకం వైపు వెళ్తారని హెచ్చరించారు. చట్టాన్ని ఉల్లంఘించడం ద్వారా స్వర్గానికి చేరుకోవచ్చని నమ్మే వారి కలలు ఎప్పటికీ నెరవేరవని వ్యాఖ్యానించారు.
