పోలీసుల మృతదేహాలను తగలబెట్టాలని అనుకున్నా: విచారణలో వికాస్ దుబే

  • Published By: vamsi ,Published On : July 10, 2020 / 08:25 AM IST
పోలీసుల మృతదేహాలను తగలబెట్టాలని అనుకున్నా: విచారణలో వికాస్ దుబే

Updated On : July 10, 2020 / 11:26 AM IST

ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్ ఎన్‌కౌంటర్‌లో 8 మంది పోలీసులను కాల్చిచంపిన కేసులో ముఖ్య నిందితుడు, గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబేను మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలోని మహాకల్ ఆలయం నుంచి అరెస్టు చేశారు.

అరెస్టు తర్వాత పోలీసులు అతన్ని ప్రశ్నించారు. ఈ సమయంలో, అతను చాలా పెద్ద విషయాన్ని వెల్లడించాడు. అనంతరం అతను ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన సంగతి తెలిసిందే.

అంతకుముందు వికాస్ విచారణలో మాట్లాడుతూ.. పోలీసుల నుంచి ముందుగానే సమాచారం అందినట్లుగా అంగీకరించాడు. పోలీసులను చంపిన తరువాత మృతదేహాలను తగలబెట్టాలని భావించినట్లు వికాస్ దుబే చెప్పారు. మృతదేహాలను దహనం చేయడానికి ఒకే చోట సేకరించి చమురు కూడా ఏర్పాటు చేశామని చెప్పారు.

వికాస్ పోలీసులతో సన్నిహితంగా ఉండటం గురించి కూడా చెప్పుకొచ్చాడు. ఉదయం పోలీసులు వస్తారని ముందుగానే మాకు సమాచారం ఉందని వికాస్ దుబే చెప్పారు. పోలీసులు ఎన్‌కౌంటర్ చేస్తారనే భయంతో దాడులకు దిగినట్లు చెప్పాడు.

వికాస్ దుబే 2001 లో రాష్ట్ర మంత్రి సంతోష్ శుక్లా హత్య కేసులో ప్రధాన నిందితుడు. 2004 లో కేబుల్ వ్యాపారవేత్త దినేష్ దుబే హత్య కేసులో కూడా వికాస్ నిందితుడు.

Read Here>>కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసును ఎన్ ఐఏకు అప్పగించిన కేంద్రం