New City in Nodia: నోయిడా, గ్రేటర్ నోయిడా తర్వాత.. ఢిల్లీకి సమీపంలో మరో కొత్త సిటీ
గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలోని చివరి గ్రామమైన మన్యచాను కూడా అథారిటీ స్వాధీనం చేసుకుంది. ఈ గ్రామానికి 1 కి.మీ దూరంలో ఢిల్లీ-హౌరా రైలు మార్గానికి అవతలి వైపున కొత్త నగరాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు ప్రారంభించారు

Uttar Pradesh: నోయిడా, గ్రేటర్ నోయిడా తర్వాత ఇప్పుడు మరో కొత్త సిటీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. దీనికి ‘దాద్రీ-నోయిడా-ఘజియాబాద్ ఇండస్ట్రియల్ రీజియన్’ అని పేరు పెట్టనున్నట్లు తెలుస్తోంది. గ్రేటర్ నోయిడా, బులంద్షహర్ మధ్య ఈ కొత్త నగరాన్ని ఏర్పాటు చేయడానికి 21,000 హెక్టార్ల భూమిని కూడా కేటాయించారు. బులంద్షహర్, ఘజియాబాద్ సహా దాదాపు 86 గ్రామాల భూమిని సేకరించనున్నారు. నోయిడా అథారిటీ తన మాస్టర్ ప్లాన్ను 2041 నాటికి పూర్తి చేయాలని ప్లాన్ చేసింది.
Hyderabad: భాగ్యనగరం లెక్కే వేరు.. మిగతా మెట్రో నగరాలతో పోలిస్తే.. హైదరాబాద్లోనే ఇళ్ల ధరలు తక్కువ
గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలోని చివరి గ్రామమైన మన్యచాను కూడా అథారిటీ స్వాధీనం చేసుకుంది. ఈ గ్రామానికి 1 కి.మీ దూరంలో ఢిల్లీ-హౌరా రైలు మార్గానికి అవతలి వైపున కొత్త నగరాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు ప్రారంభించారు. గౌతమ్ బుద్ధ నగర్లోని 20 గ్రామాలు, బులంద్షహర్లో 60 గ్రామాలు ఇందులో విలీనం కానున్నాయి. వాటిని కలిపి ‘న్యూ నోయిడా’ ఏర్పాటు చేయనున్నారు. కొత్త నగరం కోసం తమ భూమిని కూడా సేకరించబోతున్నారని ఆ గ్రామ ప్రజలు వార్తల ద్వారా తెలుసుకున్నారు. ఈ వార్తతో చాలా మంది గ్రామస్తులు అయోమయానికి గురవుతున్నారు. తమ భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నారు.
ఫజైల్పూర్, చంద్రవాల్, ఫుల్పూర్ సహా గౌతమ్ బుద్ధ నగర్, బులంద్షహర్లలో దాదాపు 21000 హెక్టార్ల భూమిని సేకరించాల్సి ఉంది. ఈ ప్రాంతం ఇన్నర్ పెరిఫెరల్, డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లకు ఆనుకొని ఉంది. దీని కారణంగా ఇక్కడ పెద్ద లాజిస్టిక్ హబ్ను రూపొందించే యోచన ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రజల ఆందోళనపై నోయిడా డెవలప్మెంట్ అథారిటీ సీఈఓ ఎం లోకేష్ మాట్లాడుతూ.. “ప్రతిపాదనను ఇప్పుడే ఆమోదించాము. 40 శాతం పరిశ్రమ, లాజిస్టిక్ హబ్గా చేస్తాము. కొంత భూమి నివాస, విద్య కోసం కేటాయిస్తాము. ఇప్పుడు ప్రతిపాదన ఆమోదించబడింది. కొన్ని రోజుల తర్వాత అది ఆమోదం పొందుతుంది. దీన్ని ప్రజల ముందుకు తీసుకువస్తాము. ప్రజల నుంచి అభ్యంతరాలు తీసుకుంటాము” అని అన్నారు.
నోయిడా 1975లో సిద్ధమైంది
1975లో, న్యూ ఓఖ్లా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ అంటే నోయిడా దాదాపు 5 లక్షల జనాభా కోసం సిద్ధం చేయబడింది. నేడు నోయిడాలో 6 వేలకు పైగా ఫ్యాక్టరీలు ఉన్నాయి. గౌతమ్ బుద్ధ నగర్ జనాభా దాదాపు 19 లక్షలు. అటువంటి పరిస్థితిలో ప్రజలు పెరుగుతున్న పారిశ్రామికీకరణతో జనాభా ఒత్తిడిని అనుభవిస్తున్నారు. కమిషనరేట్ ఏర్పాటైన తర్వాత పోలీసు వ్యవస్థ మెరుగుపడింది కానీ నోయిడాలో ప్రజారవాణా, ట్రాఫిక్ పెద్ద సమస్యగా మారిందని స్థానికులు అంటున్నారు. జనాభాకు అనుగుణంగా మౌలిక వసతులు పెరగలేదన్నారు.
నోయిడా తరువాత, ఇది గ్రేటర్ నోయిడా, నోయిడా ఎక్స్టెన్షన్, యమునా ఎక్స్ప్రెస్వే వరకు ఎప్పటికప్పుడు విస్తరిస్తోంది. అయితే న్యూ నోయిడా యొక్క మాస్టర్ ప్లాన్ అధికారికంగా ప్రజల ముందుకు వచ్చినప్పుడు, న్యూ నోయిడా నగరం కొత్త పారిశ్రామిక వాతావరణం, నివాస అవసరాల సవాళ్లను ఎలా ఎదుర్కొంటుందనేది తెలుస్తుంది.