UP Politics: ఉత్తరప్రదేశ్‭లో బీఎస్పీ, బీజేపీ నేతల మధ్య వాగ్వాదం.. మోదీ సభలోనే బాహాబాహి

ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం ముగిసిన వెంటనే బీజేపీ ఎమ్మెల్సీ హరిసింగ్ ధిల్లాన్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఆయన రెండు చేతులూ పైకెత్తి భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేయగానే ఎంపీ తన స్థానాలోంచి లేచి నిలబడ్డారు

UP Politics: ఉత్తరప్రదేశ్‭లో బీఎస్పీ, బీజేపీ నేతల మధ్య వాగ్వాదం.. మోదీ సభలోనే బాహాబాహి

BSP vs BJP: ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహాలో బహుజన్ సమాజ్ పార్టీ ఎంపీ కున్వర్ డానిష్ అలీ, భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ హరిసింగ్ ధిల్లాన్ మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వేదికపైనే ఇరు నేతలు వాగ్వాదానికి దిగారు. అనంతరం కింద కూర్చున్న ఇరు పార్టీల కార్యకర్తల మధ్య నినాదాలు మొదలయ్యాయి. ఎంపీ, ఎమ్మెల్సీ కార్యకర్తలు పరస్పరం మాటల దాడికి దిగారు. బీజేపీ కార్యకర్తలు భారత్ మాతా కీ జై అంటూ నినాదాలు చేయడం ప్రారంభించారు. అమ్రోహా కార్యక్రమం వేదికపై ఉన్న ఎంపీ కున్వర్ డానిష్ అలీపై నిరసన మొదలైంది. ఈ సమయంలో వేదికపై ఉన్న వ్యక్తులు కున్వర్ డానిష్ అలీని శాంతింపజేసేందుకు ప్రయత్నించారు.

Gaddar Dies : ఆయన మరణం బాధాకరం, తెలంగాణ ప్రజలకు తీరని లోటు- గద్దర్ మృతికి కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి సంతాపం

ఇదంతా ప్రధానమంత్రి నరేంద్రమోదీ కార్యక్రమంలో జరిగింది. అమ్రోహాలో అమృత్ భారత్ రైల్వే స్టేషన్ కార్యక్రమం నిర్వహించారు. దీని కింద దేశవ్యాప్తంగా 508 స్టేషన్ల పునరుద్ధరణకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి బహుజన్ సమాజ్ పార్టీ ఎంపీ కున్వర్ డానిష్ అలీని కూడా ఆహ్వానించారు. ఆయన వేదికపైనే ఉన్నారు. ఈ కార్యక్రమంలో అమృత్ రైల్వే స్టేషన్ కార్యక్రమం కింద ప్రపంచ స్థాయి రైల్వే స్టేషన్ల నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. ప్రోటోకాల్ ప్రకారం ఈ కార్యక్రమానికి స్థానిక ఎంపీలను కూడా ఆహ్వానించారు.

Telangana Assembly Session 2023: ఆర్టీసీ విలీనం బిల్లుకు శాసనసభ ఆమోదం.. సంబరాల్లో ఆర్టీసీ కార్మికులు

ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం ముగిసిన వెంటనే బీజేపీ ఎమ్మెల్సీ హరిసింగ్ ధిల్లాన్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఆయన రెండు చేతులూ పైకెత్తి భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేయగానే ఎంపీ తన స్థానాలోంచి లేచి నిలబడ్డారు. బీజేపీ ఎమ్మెల్సీ భారత్ మాతా కీ జై నినాదానికి వ్యతిరేకంగా ఆయన నిరసనకు దిగారు. ఎంపీ నిరసన ప్రారంభం కాగానే కార్యక్రమానికి హాజరైన ప్రజలు భారత్‌ మాతాకీ జై అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. అనంతరం ఇరువురు నేతల మధ్య చాలాసేపు వాగ్వాదం కొనసాగింది.

Musk vs Zuck: ఫేస్‭బుక్ బాస్ జూకర్‌బర్గ్‭తో కేజ్ ఫైట్ ప్రకటించిన మస్క్.. ట్విటర్‭లో లైవ్ వస్తుందట

ఎంఎల్‌సీ భారత్‌ మాతా అంటూ నినాదాలు చేయడంపై డానిష్‌ అలీ నిరసన తెలపడంతో, అక్కడున్న ప్రజలు ఆయనపై అరుపులు ప్రారంభించారు. ఇది చూసిన ఎంపీ మరింత సహనం కోల్పోయారు. కార్యక్రమానికి హాజరైన వారితో వాగ్వాదానికి దిగారు. వేదికపై ఉన్న ఇతర అతిథులతో పాటు ఎమ్మెల్సీ హరిసింగ్ ధిల్లాన్ కూడా ఆయనను శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. అయినా ఎంపీ శాంతించలేదు. నినాదాలు చేస్తూ ఎమ్మెల్సీ ప్రసంగించే ప్రదేశానికి చేరుకున్నారు. ఎమ్మెల్సీ మైకు లాక్కునేందుకు యత్నించారు. ఈ ఘటన అంతా కెమెరాలో రికార్డ్ అయింది. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

International Friendship Day: స్నేహం ఎంత చెడ్డదో తెలుసా? ఇలాంటి ఫ్రెండ్‌షిప్‌ను నమ్మొద్దు

అయితే ప్రభుత్వ కార్యక్రమాన్ని పార్టీ కార్యక్రమంగా చేస్తున్నారని, అందుకే తాను అడ్డుకునేందకు ప్రయత్నించినట్లు ఎంపీ కున్వర్ డానిష్ అలీ తెలిపారు. ఘర్షణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘‘ప్రతి కార్యక్రమాన్ని వాళ్లు (బీజేపీ) పార్టీ కార్యక్రమంలా మార్చి ఇబ్బంది కలిగిస్తున్నారు. నా కష్టం ఫలితం వల్ల అమ్రోహా, గుజ్రౌలా రైల్వే స్టేషన్లు అమృత యోజన పథకంలో భాగం అయ్యాయి. కానీ బీజేపీ నేతలు పార్టీ నినాదాలు ఇస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమంలో ప్రొటోకాల్ పాటించాలి’’ అని అన్నారు.