శశికళకు స్వాగత ఏర్పాట్లు, హెలికాప్టర్‌ ద్వారా పువ్వుల వర్షం

శశికళకు స్వాగత ఏర్పాట్లు, హెలికాప్టర్‌ ద్వారా పువ్వుల వర్షం

Updated On : February 5, 2021 / 9:30 AM IST

Welcome arrangements for Sasikala : అన్నాడీఎంకే బహిషృత నేత శశికళకు ఘనంగా స్వాగతం చెప్పేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అమ్మ మక్కల్ మున్నేట్ర కళం ఏర్పాట్లలో మునిగిపోయింది. వేలూరులో హెలికాప్టర్ ద్వారా పూల వర్షం కురిపించనున్నారు. ఇందుకు అనుమతినివ్వాలని కలెక్టర్ ను కోరడం గమనార్హం. అనుమతి వస్తే..జిల్లా సరిహద్దు మాదనూరు నుంచి పువ్వుల వర్షం కురిపించనున్నారు. కఅక్రమాస్తుల కేసుల నుంచి విడుదలైన శశికళ ఈనెల 08వ తేదీ చెన్నైకి రానున్నారు. ఆహ్వాన ఏర్పాట్లు జరుగుతుంటే…అన్నాడీఎంకే జెండాలతో చిన్నమ్మ వస్తుందోనన్న బెంగ..ఆ పార్టీ వర్గాల్లో నెలకొందని సమాచారం.

జైలు నుంచి విడుదలైన సమయంలో అన్నాడీఎంకే జెండా..ఉన్న కారులో శశికళ పయనించిన సంగతి తెలిసిందే. దీనిపై ఫిర్యాదులు హోరెత్తాయి. తమ పార్టీ జెండా ఉపయోగించకుండా..చెక్ పెట్టాలని అన్నాడీఎంకే నిర్ణయం తీసుకుంది. ఆ పార్టీ ప్రిసీడియం ఛైర్మన్ మధుసూధన్, సంయుక్త కన్వీనర్లు కేపీ మునుస్వామి, వైద్యలింగం, మంత్రులు సీవీ షణ్ముగం, జయకుమార్, తంగమణి, వేలుమణి, గురువారం సాయంత్రం డీజీపీ త్రిపాఠిని కలిసి ఫిర్యాదు చేశారు. తమ పార్టీకి సంబంధం లేని వ్యక్తి పార్టీ జెండాను ఉపయోగిస్తున్నారని, చర్యలు తీసుకోవాలని వారు కోరారు. అన్నాడీఎంకే జెండాలను ఉపయోగించే అర్హత పార్టీ కార్యకర్తలు, నాయకులకు మాత్రమే ఉందన్నారు.

సంబంధం లేని వ్యక్తి జెండాను ఉపయోగించే అర్హత లేదని, అందుకే డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు కేపీ మునుస్వామి మీడియాకు తెలిపారు. అన్నాడిఎంకే పార్టీ పన్నీరు సెల్వం, పళని స్వామి నేతృత్వంలోని సమన్వయ కమిటీకే చెందుతుందని, ఇప్పటికే ఎన్నికల కమిషన్‌ స్పష్టం చేసిందని తెలిపారు మంత్రి సీవీ షణ్ముగం. కోర్టులు సైతం స్పందించాయని గుర్తు చేశారు. ఇప్పటికే జయలలిత సమాధి వద్దకు చిన్నమ్మ వెళ్లకుండా పనుల పేరిట అడ్డుకట్ట వేసిన పాలకులు, తాజాగా జెండా వాడకానికి చెక్‌ పెట్టే పనిలో పడడం గమనార్హం.