Brahmimuhurtam : బ్రహ్మీముహుర్తంలో ఎందుకు నిద్రలేవాలి?…
మనం ఏర్పరుచుకున్న అలవాట్లను బట్టీ, ప్రకృతిని బట్టీ జీవగడియారం నడుచుకుంటూ ఉంటుంది. నిద్రపోవడం, లేవడం, కాలకృత్యాలు తీర్చుకోవడం, ఇవన్నీ సమయానికి అనుకూలంగా చేస్తేనే ఆరోగ్యంగా ఉంటాం.

Sun Rise
Brahmimuhurtam : సూర్యోదయానికి 96 నిమిషాల ముందున్న కాలాన్ని బ్రాహ్మీముహూర్తం అంటారు. అయితే రుతువుని బట్టి సూర్యోదయ వేళలు మారిపోతూ ఉంటాయి. తెల్లవారుజాము 4:00 నుండి 4:30 నిమిషాల మధ్యకాలాన్ని బ్రాహ్మీముహూర్తంగా అనుకోవచ్చు. బ్రాహ్మీ అంటేనే సరస్వతి అని అర్థం. ఈ సమయంలో ఎందుకు నిద్రలేవాలన్న దానిపై అనే సందేహాలు ఇప్పటివారికి కలుగుతుంటాయి. ఉదయాన్నే నిద్రలేవాలని మన పెద్దవాళ్లు పూర్వం చెబుతుండేవారు. రానురాను జీవవనశైలి వస్తున్న మార్పుల కారణంగా బారెడు పొద్దేక్కెంతవరకు నిద్రలెగవని పరిస్ధితి. నిద్రలేచే సమయాలూ, పనిచేసే వేళలూ మారిపోయాయి. కొన్నాళ్ల తరువాత పని చేయడానికీ, నిద్రపోవడానికీ రాత్రీపగలుతో సంబంధమే లేకపోవచ్చు. కానీ ఇప్పటికీ బ్రాహ్మీముహూర్తం అన్న మాట అక్కడక్కడా వినిపిస్తూనే ఉంటుంది.
తెల్లవారుజాము బ్రహ్మిముహుర్తం సమయంలో ప్రకృతి మొత్తం ప్రశాంతంగా, నిద్రలోని ఆఖరి జామును గడుపుతూ ఉంటుంది. సూర్యుని వేడి భూమిని కాస్త తాకుతూ ఉంటుంది, కానీ వెలుతురు ఇంకా మనల్ని చేరుకోదు. అంటే రాత్రివేళ చల్లదనాన్నీ, పగటివేళ చురుకుదనాన్నీ ఏకైక కాలంలో కలిగిఉండే సమయం ఇదన్నమాట. అందుకే ఈ సమయంలో మనుషులు సత్వగుణం కలిగి ఉంటారట. లేలేత కిరణాలు శరీరాన్ని తాకడం చాలా మంచిది కాబట్టి ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకుని సూర్యనమస్కారాలు చేయడం ఆరోగ్యానికి మంచిది.
మనం ఏర్పరుచుకున్న అలవాట్లను బట్టీ, ప్రకృతిని బట్టీ జీవగడియారం నడుచుకుంటూ ఉంటుంది. నిద్రపోవడం, లేవడం, కాలకృత్యాలు తీర్చుకోవడం, ఇవన్నీ సమయానికి అనుకూలంగా చేస్తేనే ఆరోగ్యంగా ఉంటాం. సాక్షాత్తూ ఆయుర్వేదమే తన ఆరోగ్యాన్నీ, ఆయుష్షునూ కాపాడుకోవాలనుకునేవారు బ్రాహ్మీముహూర్తంలో లేవాలి అని చెబుతోంది. ఆయుర్వేదం ప్రకారం ఈ సమయం వాత ప్రధానంగా ఉంటుంది. శరీరంలో కదలికలనీ, ఆలోచనలనీ, రక్తప్రసరణనీ ప్రభావితం చేసేది ఈ వాత లక్షణం. ఈ లక్షణం మన శరీరంలో ప్రముఖంగా ఉన్నప్పుడు మనం ఎలాంటి పనినైనా చురుగ్గా, సునాయాసంగా చేయగలుగుతాయి.
ధ్యానం చేయాలనుకునేవారికి కూడా ఈ సమయం చాలా అనుకూలమని యోగశాస్త్రం చెబుతోంది. మన శరీరంలో ఇడ, పింగళ, సుషుమ్న నాడులు ఉంటాయిని యోగుల నమ్మకం. బ్రాహ్మీముహూర్తంలో ధ్యానం చాలా సులువుగానూ, ప్రభావవంతంగానూ సాగే అవకాశం ఉంటుందట. గుండెజబ్బులు ఉన్నవారికి తెల్లవారుజామునే గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందనీ, పైగా అలా వచ్చే గుండెపోటు చాలా తీవ్రంగా ఉంటుందనీ వైద్య గణాంకాలన్నీ సూచిస్తున్నాయి. గుండెల్లో రక్తనాళాలను గడ్డకట్టించే థ్రోంబస్ అనే సమస్య ఉదయం వేళల్లోనే ఎక్కువగా ఉంటుంది. బ్రాహ్మీముహూర్తంలోనే నిద్రలేచి, వీలైతే కాసేపు ధ్యానం చేసుకుని… స్థిమితంగా రోజువారీ పనులకి సిద్ధపడితే మన రక్తపోటు కూడా సాధారణంగా ఉండే అవకాశం ఉంటుంది.
అందుకే జపాదులు చేయడానికి బ్రాహ్మీముహూర్తమే సరియైనదనీ, ఈ సమయంలో చేసే జపాదులకే స్పష్టమైన ఫలితాలుంటాయని పెద్దలు చెపుతుంటారు. విద్యార్థులు కూడా చదువుపై ఏకాగ్రత పెంచుకోవడానికి, త్వరగా చదివిన దానిపై దృష్టి ఏర్పడడానికి కూడా ఈ ప్రత్యేక సమయంలో చేసే కృషి వినియోగపడుతుంది. యోగులు కూడా సాధనా క్రమంలో ఈ సమయాన్ని వినియోగించు కుంటారు.