Delhi : 11 ఏళ్ల బాలుడిని హత్యచేసి డెడ్ బాడీని బెడ్ బాక్స్‌లో పడేసిన మహిళ

ఢిల్లీలో ఓ బాలుడి హత్య సంచలనం రేపుతోంది. గుర్తు తెలియని మహిళ బాలుడి ఇంట్లోకి ప్రవేశించి గొంతు కోసి చంపి బెడ్ బాక్స్‌లో పడేసినట్లు పోలీసులు గుర్తించారు.

Delhi : 11 ఏళ్ల బాలుడిని హత్యచేసి డెడ్ బాడీని బెడ్ బాక్స్‌లో పడేసిన మహిళ

Delhi

Delhi : ఢిల్లీలో దారుణం జరిగింది. 11 ఏళ్ల బాలుడిని గుర్తు తెలియని మహిళ గొంతు కోసి హత్య చేసింది. మృతదేహాన్ని బాలుడి ఇంట్లోని బెడ్ బాక్స్‌లో పడేసింది. బాలుడి హత్య కేసు సంచలనం కలిగిస్తోంది.

Shamshabad : శంషాబాద్‌లో దారుణం.. పెట్రోల్ పోసి మహిళను హత్యచేసి దుండగులు

వెస్ట్ ఢిల్లీలోని ఇందర్‌పురి ప్రాంతంలోని ఓ ఇంట్లో నీలు అనే మహిళ నివాసం ఉంటోంది. ఆమెకు దివ్యాన్ష్ అని 11 సంవత్సరాల కొడుకు ఉన్నాడు. ఆఫీసు ముగించుకుని ఇంటికి వచ్చిన నీలుకి డ్యాన్స్ టీచర్ దివ్యాన్ష్  క్లాస్‌కి రాలేదని ఫోన్ చేసింది. వెంటనే ఆందోళన చెందిన ఆమె సెక్యురిటీ కెమెరా ఫుటేజీలో తన ఇంటి విజువల్స్ చెక్ చేసింది. నీలు ఇంటి నుంచి ఓ మహిళ బయటకు వెళ్తున్నట్లు రికార్డైంది. ఇంట్లో బెడ్ షీట్స్, మెట్రేస్ కూడా మార్చినట్లు ఆమె గుర్తించింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగారు.

Yanamalakuduru: యనమలకుదురు హత్య కేసులో ట్విస్ట్.. ఆ మూడో వ్యక్తి ఎవరు?

ఆ తర్వాత బెడ్ బాక్స్‌లో దివ్యాన్ష్ మృతదేహం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పోస్టుమార్టంలో దివ్యాన్ష్‌ను గొంతు నులిమి చంపడం వల్ల మరణించినట్లు తేలింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఈ నేరానికి పాల్పడిన మహిళ వివరాలపై ఆరా తీస్తున్నారు.