World Bamboo Day 2021 : భారత్ లో ఎదురు లేని ‘వెదురు’..చైనా తర్వాత మనమే
సెప్టెంబర్ 18 ప్రపంచ వెదురు దినోత్సవం. భారత్ లో వెదురుకు ఎదురే లేదు. వెదురు విస్తీర్ణయంలో చైనా మొదటిస్థానంలో ఉంటే తరువాత భారత్ ఉంది.
World Bamboo Day 2021: వెదురు. దీనికి కూడా ఓ రోజు ఉంది. సెప్టెంబర్ 18 ప్రపంచ వెదురు దినోత్సవం. అంతర్జాతీయ మార్కెట్లో ఈ వెదురు వ్యాపారం చేసే వారికి కోట్లాది రూపాయలు తెచ్చిపెడుతోంది. వెదురు గొప్పదనం గురించి చెప్పడానికి.. వెదురు పెంపకంపై అవగాహన కల్పించేందుకు ఈ వెదురు దినోత్సవాన్ని జరుపుకుంటారు.ఈ వెదురు దినోత్సవం సందర్భంగా వెదురు గురించి తెలుసుకుందాం.
ప్రపంచ వెదురు దినోత్సవం ఆవిర్భాం..
ప్రపంచ వెదురు.. అంటే పెంపక-పరిరక్షణ నిర్వాహణ సంస్థ ప్రతి ఏడాది ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. 2009లో బ్యాంకాక్లో జరిగిన వరల్డ్ బాంబూ కాంగ్రెస్లో ఈ దినోత్సవాన్ని నిర్వహించాలని తీర్మానించారు. వెదురు పెంపకం, సంప్రదాయ పద్ధతుల్లో వాడకం గురించి, వెదురు వాడకం పెంపొందించేలా చర్యల గురించి..అన్నింటికి మించి అర్థిక పురోగతికి వెదురు ఉత్పత్తులను ఎలా నిర్వహించుకోవాలో అనే విషయాలపై ఈ వెదురు దినోత్సవం రోజున చర్చలు జరుపుతారు.
గిరిజనులకు వెదురు ఎంతగానో ఉపయోపడుతోంది.వారి ఇండ్లు వెదురు బొంగులతోనే నిర్మించుకుంటారు. గిరిజనుల జీవితాల్లో వెదురు ఓ భాగమైపోయింది. గిరిజనులకు జీవనోపాధిగా కూడా వెదురు ఉపయోగపడుతోంది. అంతేకాదు గిరిజనుల సంప్రదాయాల్లోనూ వెదురు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. వెదురును ఓ ఆయుధంలాకూడా వాడతారు గిరిజనులు.అడవుల్లోకి వెళ్లినప్పుడు జంతువుల నుంచి రక్షణ కోసం వెదురుతో చేసిన ఊటెలను ఉపయోగిస్తారు.
Read more : ప్లాస్టిక్ పై యుద్ధం.. వెదురు బొంగులతో వాటర్ బాటిళ్లు
చైనా, భారత్ లాంటి ఆసియా దేశాల్లో అభివృద్ధి చెందేందుకు వెదురు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. 65 శాతం సాగుదల ఆసియా ఖండాల్లోనే సాగుతోంది. ఆ తర్వాత స్థానంఅమెరికా, ఆఫ్రికా ఖండాలు ఉన్నాయి. చైనా ఈ విషయంలో 70 శాతంతో అగ్రస్థానంలో ఉండగా.. వెదురు విస్తీర్ణంలో రెండో స్థానంలో ఉన్న భారత్ ఉంది. వియత్నం, థాయ్లాండ, కాంబోడియాలు మార్కెట్ షేర్ మనకంటే ఎక్కువే. మన దగ్గర వెదురు విస్తీర్ణంగా పెరుగుతుంది.
వెదురులో 115 జాతులు..ఒక్కో జాతిది ఒక్కో ప్రత్యేకత..
వెదురు పోవాషియే కుటుంబానికి చెందినది. ఈ వెదురులో 115 జాతులున్నాయి. అంతేకాదు దీనికి ఉపజాతులు కూడా ఉన్నాయి. 1,400 ఉపజాతుల మొక్కలు ఉన్నాయి. వీటిలో కొన్ని జాతులు రోజుకి 30 సెంటీమీటర్ల చొప్పున పెరుగుతాయి.
వెదురును పేదవాడి కలపగా చెప్పుకుంటారు. ఇళ్లు నిర్మించుకోవటానికే కాదు రైతులకు ఊతకర్రగా వెదురుది ప్రత్యేక స్థానం. వెదురు కర్ర లేనిదే రైతు పొలం వెళ్లేవారు కాదు. వెదురులో ఓ జాతి మొక్క రైతుల చేతికర్రగా అండగా ఉంటుంది. చేతి కర్రతో పొలం వెళ్లిన రైతుకు ఓ పనిముట్టుగానే కాకుండా విషసర్పాలనుంచి రక్షణనిస్తు ఆయుధంగా కూడా ఉపయోగపడుతుంది. అంతేకాదు వెదురు ఆకుపచ్చ బంగారంగా పేరుంది. ఈ వెదరు కలప కట్టడాలు, నిర్మాణ మెటీరియాల్గా, పేపర్, హస్తకళల్లోనూ, అనేక వాటికి వెదురును ఉపయోగిస్తారు.
Read more :Bamboo bridge: వరుడి రాక కోసం రాత్రికిరాత్రే కాలువపై వెదురు వంతెన
వెదురు పెంపకానికి..
వెదురు చెట్లను పెంపకానికి రసాయనాలు, పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్ ఏవీ కూడా అవసరం ఉండదు. వేస్ట్ ల్యాండ్లో సైతం పెరిగి.. పర్యావరణాన్ని కాపాడుతుంది వెదురు. అంతేకాదు అధిక వర్షలప్పుడు మట్టి కొట్టుకుపోకుండా అడ్డుకుని అడవుల క్షీణతను అడ్డుకుంటుంది వెదురు. వెదురు ఆకులు పశుగ్రాసంగా కూడా ఉపయోగపడతాయి. దీనిని సిలికాను మందుల తయారీలో ఉపయోగిస్తారు. వెదురు సామాన్లకు, ఫర్నీచర్కు, పరికరాలకు, షోకేజ్ వస్తువులకు గ్లోబల్ మార్కెట్లో మాంచి డిమాండ్ ఉంది.బాంబూ చెట్ల పెంపకంతో ఎంతోమంది మంచి ఆదాయాన్ని పొందుతున్నారు.రైతులు లక్షాధికారులు కావాలంటే ఈ చెట్లను పెంచవచ్చు. కేంద్ర ప్రభుత్వం వెదురు చెట్ల పెంపకానికి ఒక్కో చెట్టుకు రూ.120 సబ్సిడీ అందిస్తోంది.
దేశంలో అధిక డిమాండ్..
భారత్ లో వెదురు చెట్లకు డిమాండ్ కూడా అధికంగా ఉంది. వెదురు మొక్కలు నాటితే 4 సంవత్సరాలకు మంచి ఆదాయం వస్తుంది. పెద్దగా పెట్టుబడి కూడా అవ్వదు. అలాగే ప్రతిసారి ఈ చెట్లను నాటాల్సిన పని ఉండదు. ఒక్కసారి నాటితే 40 ఏళ్లు రాబడి పొందే అవకాశం ఉంటుంది. అయితే ఈ బ్యాంబో చెట్లలో 136 రకాల్లో ఏది లాభం అందిస్తుందో తెలుసుకుని ఆ రకాన్ని ఎంచుకుంటే మంచిది.
ఒక హెక్టార్లో 1500 మొక్కలను నాటవచ్చు. ఒక్కో మొక్కు ఐదు అడుగుల దూరం ఉండాలి. నాలుగేళ్ల తర్వాత నుంచి రూ.3 లక్షల నుంచి రూ.3.5 లక్షల వరకు పొందవచ్చు. అయితే ఈ మధ్య కాలంలో ఇలాంటి బిజినెస్ చేసేందుకు ఎంతో మంది ముందుకు వస్తున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందే అవకాశం ఉంటుంది. అధిక రాబడి వచ్చే బిజినెస్లను చేసే వారి కోసం ప్రభుత్వాలు కూడా రుణాలు, సబ్సిడీ వంటివి అందిస్తున్నాయి. మరి చూశారా వెదురుతో ఎన్ని లాభాలో..