CM Revanth Reddy : అసెంబ్లీ నుంచి బస్సులో వెళ్లి.. మంత్రులతో కలిసి సినిమా చూసిన సీఎం రేవంత్.. ఫొటోలు వైరల్..
జ్యోతిరావు పూలే జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన పూలే సినిమా నేడు హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో స్పెషల్ షో వేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ తో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు అసెంబ్లీ నుంచి ఆర్టీసీ బస్సులో ప్రసాద్ ల్యాబ్ కి వచ్చి ఈ సినిమా చూసారు.









