BRS BSP Alliance Talks : తెలంగాణ రాజకీయాల్లో సంచలనం.. బీఆర్ఎస్, బీఎస్పీ పొత్తు ఖరారు

మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానాల అభ్యర్థులపై కేసీఆర్ ఆ పార్టీ నేతలతో చర్చలు జరిపారు.

BRS BSP Alliance Talks : తెలంగాణ రాజకీయాల్లో సంచలనం.. బీఆర్ఎస్, బీఎస్పీ పొత్తు ఖరారు

RS Praveen Kumar Meets KCR

BRS BSP Alliance Talks : లోక్ సభ ఎన్నికల వేళ తెలంగాణలో కొత్త పొత్తు పొడిచింది. బీఆర్ఎస్, బీఎస్పీ మధ్య పొత్తు ఖరారైంది. బీఆర్ఎస్ తో కలిసి వెళ్లాలని బీఎస్పీ నిర్ణయించింది. ఎంపీ ఎన్నికల్లో తాము బీఆర్ఎస్ తో కలిసి పోటీ చేస్తామని ఆ పార్టీ ప్రకటించింది. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ కలిసి పోటీ చేయాలని బీఎస్పీ రాష్ట్ర పార్టీ నిర్ణయం తీసుకుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఆ పార్టీ ప్రతినిధుల బృందం కలిసి జరిపిన చర్చల్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించి విధి విధానాలు త్వరలో ఖరారు కానున్నాయని తెలిపారు.

బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ తో బీఆర్ఎస్ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భేటీ అయ్యారు. వీరి భేటీ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీఎస్పీ మధ్య పొత్తు ఉంబోతోందని.. బీఆర్ఎస్ మద్దతుతో ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారని చర్చ మొదలైంది. ఇవాళ మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానాల అభ్యర్థులపై కేసీఆర్ ఆ పార్టీ నేతలతో చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో ప్రవీణ్ కుమార్ కు మద్దతిచ్చేందుకు కేసీఆర్ అంగీకరించినట్లు తెలుస్తోంది.

పార్లమెంటు ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ కావడం చర్చకు దారితీసింది. పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ భేటీ జరిగినట్లు సమాచారం.

ఇవాళ నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్ నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపికకు సంబంధించి తెలంగాణ భవన్ లో సమీక్ష సమావేశం జరిగింది. అదే సమయంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ తో భేటీ కావడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ రెండు పార్టీలు కూడా భావ్యసారూప్యతో ముందుకెళ్లే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గెలవలేకపోయారు. నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఆలంపూర్ నియోజకవర్గం ప్రవీణ్ కుమార్ సొంత నియోజకవర్గం కూడా.

ఈ అంశం పార్లమెంట్ ఎన్నికల్లో ప్రవీణ్ కు కలిసి వస్తుందనే ఒక అంచనాలో బీఎస్పీ నేతలు ఉన్నారు. నాగర్ కర్నూల్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న రాములు సడెన్ గా పార్టీ మారడంతో ఆ స్థానంలో కొత్త అభ్యర్థిని వెతికే ప్రయత్నం చేస్తోంది బీఆర్ఎస్ అగ్రనాయకత్వం. గువ్వల బాలరాజు పార్టీ అభ్యర్థిగా సిద్ధంగా ఉన్నప్పటికీ.. బీఆర్ఎస్-బీఎస్పీ కలిసి పోటీ చేస్తే రాష్ట్రవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల్లో ఈ ప్రభావం ఉంటుందనే అంచనాలో పార్టీ నేతలు ఉన్నారు.

Also Read : లోక్‌సభ ఎన్నికలు.. తెలంగాణ ఎవరి వైపు? ఆ 3 పార్టీల భవిష్యత్ ఏంటి?