జాలర్లకు 5లక్షలు ఆర్థికసాయం

పాకిస్తాన్ చెర నుంచి విడుదలైన ఏపీ మత్స్య కారుల పట్ల సీఎం జగన్మోహన్రెడ్డి ఉదారత చూపారని మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. 20 మంది ఆంధ్రా జాలర్లకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారని తెలిపారు.
హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న మంత్రి మోపిదేవి విలేకరులతో మాట్లాడుతూ..పాకిస్తాన్ చెరలో బందీలుగా ఉన్న మత్స్యకారులను సీఎం జగన్ చొరవ,కృషితో విడిపించడం గర్వంగా ఉందన్నారు. 14 నెలలుగా ఏపీకి చెందిన 22 మంది మత్స్యకారులు పాకిస్తాన్ జైలులో బిక్కుబిక్కుమంటూ గడిపారని.. సీఎం వైఎస్ జగన్ ప్రమాణాస్వీకారం చేశారన్న వార్తతో స్వస్థలం చేరుకోగలమన్న ఆత్మవిశ్వాసం వారిలో కలిగిందని తెలిపారు.
సీఎం జగన్ ప్రసాదించిన పునర్జన్మగా వారు భావిస్తున్నారన్నారు. మరో ఇద్దరు మత్స్యకారులను రెండు రోజుల్లో తీసుకువస్తామని మోపిదేవి చెప్పారు. 20 మంది మత్స్యకారులు సాధారణ స్థితికి వచ్చే వరకు ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. మత్స్యకారులకు సీఎం జగన్ ఐదు లక్షల రూపాయల చొప్పున చెక్లు అందజేస్తారని మంత్రి మోపిదేవి వెల్లడించారు. విడుదలైన జాలర్లు సీఎం జగన్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు