మండలి రద్దు దురదృష్టకరం : బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్

  • Published By: chvmurthy ,Published On : January 27, 2020 / 04:02 PM IST
మండలి రద్దు దురదృష్టకరం : బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్

Updated On : January 27, 2020 / 4:02 PM IST

శాసనమండలి రద్దును తప్పుబట్టారు బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్. రద్దు ఏకపక్ష నిర్ణయమని, దురదుష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. నిర్మాణాత్మక చర్యలకు మండలి చాలా ఉపయోగకరమైందని ఆయన అభిప్రాయపడ్డారు. 

శాసనమండలి రద్దుకు అసెంబ్లీ నిర్ణయించిన తర్వాత లోక్‌సభ ఆమోదం లాంఛనమేనని మాధవ్ చెప్పారు. ఏపీ శాసనమండలి రద్దు తీర్మానం ఏపీ అసెంబ్లీలో ఆమోదం పొందిన విషయం తెలిసిందే. 

అసెంబ్లీలో సుదీర్ఘంగా చర్చ జరిగిన అనంతరం దీనిపై ఓటింగ్ పెట్టారు. 133 మంది ఎమ్మెల్యేలు మండలి రద్దుకు అనుకూలంగా ఓటు వేశారని స్పీకర్ తమ్మినేని సీతారాం వెల్లడించారు. తీర్మానం ఆమోదం పొందిందని సభాపతి తెలిపారు. అనంతరం సభ నిరవదికంగా వాయిదా పడింది.