Tamil Nadu: ముందుగా చెప్పినట్లే బీజేపీకి గట్టి షాక్ ఇచ్చిన తమిళనాడు సీఎం స్టాలిన్

డీఎంకై ఫైల్స్ విడుదల చేసిన అనంతరం తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై మాట్లాడుతూ మున్ముందు మరిన్ని ఫైల్స్ విడుదల చేస్తామన్నారు. చెన్నైలో మొదటి దశ మెట్రోరైలు ప్రాజెక్టు టెండర్‌ను ఓ సంస్థకు కేటాయించి ఎన్నికల నిధుల కోసం 200 కోట్ల రూపాయల మేరకు స్టాలిన్ ప్రభుత్వం ముడుపులు స్వీకరించినట్లు అన్నామలై ఆరోపణలు చేశారు

Tamil Nadu: ముందుగా చెప్పినట్లే బీజేపీకి గట్టి షాక్ ఇచ్చిన తమిళనాడు సీఎం స్టాలిన్

MK Stalin and annamalai

Updated On : April 16, 2023 / 8:33 PM IST

Tamil Nadu: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అన్నంత పనీ చేశారు. తన ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేసిన బీజేపీకి షాకిచ్చారు. ముందుగా చెప్పినట్లే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిపై వందల కోట్ల పరువునష్టం వాశారు. రెండు రోజుల క్రితం డీఎంకే ఫైల్స్ అంటూ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌‌పై తమిళనాడు బీజేపీ శాఖ అధ్యక్షుడు అన్నామలై హడావుడి చేశారు. డీఎంకే 1.34 లక్షల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిందంటూ ఆరోపించారు. ఈ ఆరోపణలపై డీఎంకే కన్నెర్ర చేసింది. అన్నామలైకి లీగల్ నోటీసులు పంపింది. అందులో 500 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేసింది.

Atiq Ahmed Murder: అతిక్ అహ్మద్‭పై కాల్పులు జరిపిన ముగ్గురిపై అనేక కేసులు.. తమకేమీ తెలియదంటున్న కుటుంబ సభ్యులు

డీఎంకై ఫైల్స్ విడుదల చేసిన అనంతరం తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై మాట్లాడుతూ మున్ముందు మరిన్ని ఫైల్స్ విడుదల చేస్తామన్నారు. చెన్నైలో మొదటి దశ మెట్రోరైలు ప్రాజెక్టు టెండర్‌ను ఓ సంస్థకు కేటాయించి ఎన్నికల నిధుల కోసం 200 కోట్ల రూపాయల మేరకు స్టాలిన్ ప్రభుత్వం ముడుపులు స్వీకరించినట్లు అన్నామలై ఆరోపణలు చేశారు. డీఎంకే ఫైల్స్‌ పేరుతో డీఎంకే ఎంపీలు, మంత్రుల ఆస్తులు, అక్రమార్జనల వివరాలను విడుదల చేశారు. 2006 నుంచి 2011 వరకు డీఎంకే ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చెన్నైలో మొదటి దశ మెట్రోరైలు ప్రాజెక్టు పనులు చేపట్టేందుకు అనుమతి లభించిందని, ఆ ప్రాజెక్టు కోసం జికా సంస్థ 59 శాతం, కేంద్ర ప్రభుత్వం 15 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 21 శాతం మేరకు నిధులు కేటాయించాయని, ఆ ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.14 వేల కోట్లుగా నిర్ణయించారని, ఆ తర్వాత ఎన్నికలు జరిగేందుకు 6 నెలల వ్యవధి ఉన్న సమయంలో అత్యవసరంగా టెండర్లు రూపొందించారని అన్నామలై ఆరోపించారు.

Rahul Gandhi: కులగణన మీద మొదటిసారి మాట్లాడిన రాహుల్ గాంధీ.. యూపీఏ డాటా విడుదల చేయాలంటూ మోదీకి డిమాండ్

డీఎంకే అవినీతి గురించి సీబీఐకి తాను త్వరలో ఫిర్యాదు చేయబోతున్నట్లు వెల్లడించారు. మెట్రోరైలు ప్రాజెక్టులో కేంద్ర ప్రభుత్వం 15 శాతం నిధులు కేటాయించడం వల్ల ఈ కేసును సీబీఐ విచారణ జరిపేందుకు వీలుందని కూడా అన్నామలై చెప్పారు. వాస్తవానికి అన్నామలై ఆరోపణలు చేసిన రోజే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఎంకే హెచ్చరించింది. రెండు రోజులకు అన్నంత పనీ చేసింది. అయితే డీఎంకే ఇచ్చిన లీగల్ నోటీసులపై అన్నామలై స్పందించాల్సి ఉంది.