Uttar Pradesh: యూపీ ప్రజలకు జైలు నుంచి లేఖ రాసిన అతీక్ అహ్మద్ కుమారుడు.. బీజేపీకి ఎస్పీకి ఓటేయొద్దంటూ పిలుపు
‘‘ఎన్కౌంటర్లలో బీజేపీ, యోగి ఆదిత్యనాథ్ల పాత్ర ఎంత ఉందో అఖిలేష్ యాదవ్ది కూడా అంతే పాత్ర ఉంది. మా నాన్న, మామ, అన్నయ్యల ఎన్కౌంటర్లో ఇద్దరి పాత్ర సమానంగా ఉంది. మీ హృదయాల్లో మా నాన్నగారికి ఏమాత్రం కాస్తంత చోటు ఉన్నా కూడా బీజేపీకి, ఎస్పీకి ఓటేయకండి’’ అని రాసుకొచ్చాడు.
Uttar Pradesh: కొద్ది రోజుల క్రితం మీడియా సమక్షంలో దారుణ హత్యకు గురై అతిక్ అహ్మద్ కుమారుడు అలీ అహ్మద్ రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ లేఖలో తన తండ్రి అతిక్ అహ్మద్, మామ అష్రఫ్, సోదరుడు అసద్ మరణాలకు కారణం భారతీయ జనతా పార్టీ, సమాజ్వాదీ పార్టీలని నిందించాడు. అంతే కాకుండా.. స్థానిక సంస్థల ఎన్నికల్లో ముస్లింలు బీజేపీకి గానీ, సమాజ్వాదీ పార్టీకి గానీ ఓటు వేయవద్దని లేఖలో అలీ విజ్ఞప్తి చేశాడు. అయితే ఏ పార్టీకి మద్దతివ్వాలో ఈ లేఖలో చెప్పనప్పటికీ, ముస్లింలు ఏకం కావాలని విజ్ఞప్తి చేశారు. లేఖ ద్వారా బీఎస్పీకి మద్దతుగా ఓటు వేయాలని కోరినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
YS Sharmila: నీ దగ్గర అవినీతి ఎమ్మెల్యేల చిట్టా ఉన్నా.. చర్యలెందుకు తీసుకోవడం లేదు కేసీఆర్?
ఇప్పటికే మా నాన్న, మామ, అన్నను పోలీసులు ఎన్కౌంటర్లో చంపేశారని లేఖలో వాపోయాడు. ఇప్పుడు తనను కూడా చంపేందుకు ప్రయత్నిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశాడు. తన తల్లి షైస్తా పర్వీన్ను ఎన్కౌంటర్ చేయడం కోసం వెతుకుతున్నారని, ఈమాత్రం సంకేతాలను బట్టి అర్థం చేసుకోవాలని సూచించాడు. ఇప్పుడు ముస్లింలను ఎవరూ తప్పుదారి పట్టించలేరని, తాను చెప్పిన ఈ విషయాలపై శ్రద్ధ పెట్టమని అభ్యర్థించాడు.
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, అఖిలేష్ యాదవ్ పేర్లను లేఖలో పేర్కొన్నాడు. ‘‘ఎన్కౌంటర్లలో బీజేపీ, యోగి ఆదిత్యనాథ్ల పాత్ర ఎంత ఉందో అఖిలేష్ యాదవ్ది కూడా అంతే పాత్ర ఉంది. మా నాన్న, మామ, అన్నయ్యల ఎన్కౌంటర్లో ఇద్దరి పాత్ర సమానంగా ఉంది. మీ హృదయాల్లో మా నాన్నగారికి ఏమాత్రం కాస్తంత చోటు ఉన్నా కూడా బీజేపీకి, ఎస్పీకి ఓటేయకండి’’ అని రాసుకొచ్చాడు.