Ayodhya Darshan : న్యూ ఇయర్ వేళ.. ఆయోధ్యకు భారీగా రానున్న భక్తులు.. రామాలయ దర్శనం టైమింగ్స్ పొడిగింపు.. హోటల్ గదులన్నీ ఫుల్..!
Ayodhya Darshan Timings : అయోధ్య, చుట్టుపక్కల నగరాల్లో వసతి కోసం హోటళ్ళు, గదులు ఇప్పటికే నిండిపోయాయి. ఆలయ ట్రస్టు దర్శన సమయాన్ని కూడా పొడిగించింది.

Ram Temple trust extends darshan timings
Ayodhya Darshan Timings : 2025 కొత్త సంవత్సరం రాబోతోంది. రామమందిర ప్రతిష్ఠాపన జరిగి ఒక ఏడాది పూర్తవుతోంది. కొత్త ఏడాది జనవరిలో అయోధ్యలో రామ మందిరం ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా చాలా మంది రామ మందిరాన్ని సందర్శించడానికి అయోధ్యకు రానున్నారు.
అయోధ్య, చుట్టుపక్కల నగరాల్లో వసతి కోసం హోటళ్ళు, గదులు ఇప్పటికే నిండిపోయాయి. దీంతో ఆలయ ట్రస్టు దర్శన సమయాన్ని కూడా పొడిగించింది. రద్దీని ఎదుర్కొనేందుకు మెరుగైన ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు ఆయోధ్య రామ ఆలయాన్ని ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సందర్శించవచ్చు.
Read Also : Luxury Car Sales 2024 : 2024 ఏడాదిలో లగ్జరీ కార్ల అమ్మకాల రికార్డు.. ప్రతి గంటకు 6 లగ్జరీ కార్ల విక్రయాలు..
జనవరి 15 వరకు అన్ని హోటల్ రూమ్స్ బుకింగ్ ఫుల్ :
నివేదికల ప్రకారం.. అయోధ్యలోని ఒక హోటల్ యజమాని జనవరి 15 వరకు తన వద్ద ఉన్న అన్ని గదులు ఇప్పటికే బుక్ అయినట్టుగా తెలిపారు. కొత్త సంవత్సరంలో వచ్చే సందర్శకులకు స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. అయితే, ఇప్పటికీ కొన్ని హోటళ్లలో గదులు ఖాళీగా ఉన్నాయి.
అయితే, ఈ హోటళ్లలో రూమ్ అద్దెలు సాధారణం కంటే చాలా ఎక్కువ. 2024 సంవత్సరం ప్రారంభంలో రామాలయంలో పూజలు ప్రారంభమైనప్పటి నుంచి చాలా మంది భక్తులు దర్శనం కోసం అయోధ్యకు వస్తున్నారు. హిందూ నూతన సంవత్సరం మార్చి-ఏప్రిల్లో వస్తుంది. కానీ, ఇప్పుడు ఆంగ్ల నూతన సంవత్సరం ప్రకారం కూడా చాలా మంది ఆలయ దర్శనానికి వస్తుంటారు.

Ram Temple darshan timings ( Image Source : Google )
కొత్త సంవత్సరం మొదటి రోజున పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి వెళ్లి దేవుడి ఆశీస్సులు పొందుతారని స్థానిక పూజారి ఒకరు తెలిపారు. ఈసారి రామ మందిరాన్ని సందర్శించేందుకు చాలా మంది వస్తుంటారు. అందువల్ల, అయోధ్య పోలీసులు ఆలయం, ఇతర ముఖ్యమైన ప్రదేశాలలో భద్రతను పెంచారు. తద్వారా ప్రతి ఒక్కరూ భద్రత మధ్య దర్శనం చేసుకోవచ్చు. పెద్దఎత్తున వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ట్రస్టు ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా డిసెంబర్ 30 నుంచి జనవరి 15 వరకు ఆలయ ట్రస్టు ప్రత్యేక ఏర్పాట్లు చేయనుంది.
రద్దీని నియంత్రించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు :
ఈ సందర్భంగా ఆయోధ్య దర్శన సమయాన్ని పెంచామని, ప్రతి ఒక్కరూ సులభంగా దర్శనం చేసుకునేలా రద్దీని నియంత్రించేందుకు చక్కటి ఏర్పాట్లు చేశామని ట్రస్టు అధికారి ఒకరు తెలిపారు. 2024 ప్రారంభంలో రామాలయంలో పూజలు ప్రారంభమైన తర్వాత దేశం నలుమూలల నుంచి చాలా మంది భక్తులు అయోధ్యను సందర్శించడానికి వస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ కూడా హాజరయ్యారు. 2022లో దాదాపు 32 కోట్ల మంది ఉత్తరప్రదేశ్కు వచ్చారు. కానీ, ఈ ఏడాది కేవలం 6 నెలల్లోనే 32 కోట్ల మందికి పైగా ఆయోధ్యకు వచ్చారు.
అయోధ్య, వారణాసిలలో పర్యాటకుల సంఖ్య పెరుగుతున్న క్రమంలో రాష్ట్రంలో పర్యాటకం చాలా వేగంగా అభివృద్ధి చెందుతోందని యూపీ ప్రభుత్వం చెబుతోంది. గత ఏడాది జనవరిలో రామమందిరం ప్రారంభించిన తర్వాత చాలా మంది ఉత్తరప్రదేశ్కు రావడం ప్రారంభించారు. ఒక్క జనవరి నెలలోనే దాదాపు ఏడు కోట్ల మంది ప్రజలు యూపీని సందర్శించారు.