WTC Points table : ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్కు ముందు టీమ్ఇండియాకు భారీ షాక్..
ఇంగ్లాండ్తో ఐదు మ్యాచుల టెస్టు సిరీస్కు ముందు టీమ్ఇండియాకు భారీ షాక్ తగిలింది.
![WTC Points table : ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్కు ముందు టీమ్ఇండియాకు భారీ షాక్.. WTC Points table : ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్కు ముందు టీమ్ఇండియాకు భారీ షాక్..](https://10tv.in/wp-content/uploads/2024/01/New-Project-27-6.jpg)
Team India
WTC Points table 2023-2025 : ఇంగ్లాండ్తో ఐదు మ్యాచుల టెస్టు సిరీస్కు ముందు టీమ్ఇండియాకు భారీ షాక్ తగిలింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ 2023-2025 సైకిల్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి పడిపోయింది. అడిలైడ్ వేదికగా వెస్టిండీస్తో జరిగిన తొలి టెస్టు మ్యాచులో ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో విజయం సాధించడంతో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా అగ్రస్థానానికి చేరుకుంది.
డబ్ల్యూటీసీ 2023-2025 సైకిల్లో ఆస్ట్రేలియా ఇప్పటి వరకు 9 టెస్టు మ్యాచులు ఆడింది. ఇందులో ఆరు మ్యాచుల్లో విజయాలు సాధించింది. ఓ మ్యాచ్ డ్రా కాగా.. మిగిలిన రెండు మ్యాచుల్లో ఓడిపోయింది. 61.11 విజయశాతంతో పట్టికలో మొదటి స్థానానికి చేరుకుంది. ఇక భారత జట్టు విషయానికి వస్తే.. ఇప్పటి వరకు 4 టెస్టులు ఆడింది. ఇందులో రెండు మ్యాచుల్లో భారత్ గెలవగా ఓ మ్యాచులో ఓడిపోయింది. మరో మ్యాచ్ డ్రాగా ముగిసింది. 54.16 విజయశాతం టీమ్ఇండియా రెండో స్థానంలో ఉంది.
Rahane : రంజీట్రోఫీలో రహానే భీభత్సం..! ఇలా ఆడితే రీ ఎంట్రీ మరిచిపోవాల్సిందే..!
ఆ తరువాతి స్థానాల్లో దక్షిణాఫ్రికా(50), న్యూజిలాండ్(50), బంగ్లాదేశ్ (50)లు వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచాయి. 36.66 శాతం విజయశాతంలో పాకిస్తాన్లో ఆరో స్థానంలో ఉండగా, ఆడిన ఐదు మ్యాచుల్లో రెండు మ్యాచుల్లో గెలిచి మరో రెండు మ్యాచుల్లో ఓడి ఓ మ్యాచ్ను డ్రా చేసుకున్న ఇంగ్లాండ్ 15 విజయశాతంతో ఏడో స్థానంలో ఉంది.
టీమ్ఇండియా ఫైనల్ చేరుకోవాలంటే..?
ప్రపంచటెస్టు ఛాంపియన్ షిప్ (2023-2025) లో టీమ్ఇండియా ఫైనల్ చేరుకోవాలంటే ఇంగ్లాండ్తో ఈ నెల 25 నుంచి ఆరంభం కానున్న ఐదు టెస్టు మ్యాచుల సిరీస్ను గెలవడం చాలా ముఖ్యం. ఎన్ని మ్యాచుల్లో భారత్ గెలుస్తుంది అన్నదానిపైనే అది ఆధారపడి ఉంటుంది. మార్చి చివరి నాటికి పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్కు చేరుకుంటాయన్న సంగతి తెలిసిందే.