IND vs BAN : తొలి టెస్టులో పట్టు బిగించిన భారత్.. ముగిసిన రెండో రోజు ఆట
చెపాక్ టెస్టులో భారత్ పట్టుబిగించింది.

Chepauk test
చెపాక్ టెస్టులో భారత్ పట్టుబిగించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో భారత్ మూడు వికెట్ల నష్టానికి 81 పరుగులు చేసింది. ప్రస్తుతం భారత్ 308 పరుగులతో ఆధిక్యంలో ఉంది. శుభ్మన్ గిల్ (33), రిషబ్ పంత్ (12) క్రీజులో ఉన్నారు.
227 పరుగులతో రెండో ఇన్నింగ్స్ను ఆరంభించిన భారత్కు శుభారంభం దక్కలేదు. మరోసారి కెప్టెన్ రోహిత్ శర్మ (5) తక్కువ స్కోరుకే పరిమితం అయ్యాడు. తొలి ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీతో రాణించిన జైస్వాల్ (10), తన పేలవ ఫామ్ కంటిన్యూ చేస్తూ కోహ్లీ(17)లు పెవిలియన్కు చేరుకున్నారు. దీంతో భారత్ 67 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. అయితే.. తొలి ఇన్నింగ్స్లో డకౌట్ అయిన గిల్ రెండో ఇన్నింగ్స్లో బాధ్యతాయుతంగా ఆడుతున్నాడు. రిషబ్పంత్తో కలిసి రెండో రోజు ఆటను ముగించాడు.
అంతకముందు బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో 149 పరుగులకు ఆలౌటైంది. బంగ్లా బ్యాటర్లలో షకీబ్ అల్ హసన్ (32), మెహిదీ హసన్ మిరాజ్ (27 నాటౌట్) ఫర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా నాలుగు వికెట్లు తీశాడు. ఆకాశ్ దీప్, జడేజా, సిరాజ్ లు తలా రెండు వికెట్లు పడగొట్టారు.
ఈ మ్యాచ్లో టీమ్ఇండియా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసింది. మొదటి ఇన్నింగ్స్లో భారత్ 376 పరుగులు చేసింది. టీమ్ఇండియా బ్యాటర్లలో రవిచంద్రన్ అశ్విన్ (113; 133 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీ చేయగా రవీంద్ర జడేజా (86; 124 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లు), యశస్వి జైస్వాల్ (56; 118 బంతుల్లో 9 ఫోర్లు) లు హాఫ్ సెంచరీలతో రాణించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో హసన్ మహమూద్ 5 వికెట్లు తీశాడు. తస్కిన్ అహ్మద్ మూడు వికెట్లు, నహిద్ రానా, మెహిదీ హసన్ మిరాజ్ చెరో వికెట్ పడగొట్టారు.
IPL 2025 : ఐపీఎల్ 2025 మెగా వేలానికి డేట్ ఫిక్స్!.. ఫ్రాంచైజీలకు బీసీసీఐ డెడ్లైన్ టెన్షన్?