KXIPvsMI: 3 వికెట్ల తేడాతో ముంబై విజయం

KXIPvsMI: 3 వికెట్ల తేడాతో ముంబై విజయం

Updated On : April 10, 2019 / 6:50 PM IST

ముంబైలోని వాంఖడే వేదికగా జరిగిన పోరులో పంజాబ్ ముంబై వికెట్ల తేడాతో గెలుపొందింది. 198 పరుగుల లక్ష్య చేధనలో భాగంగా ముంబై దూకుడైన ఇన్నింగ్స్ తో ఆకట్టుకుంది. క్వింటన్ డికాక్(24), సిద్దేశ్ లాడ్(15), సూర్యకుమార్ యాదవ్(21), కీరన్ పొలార్డ్(83), ఇషాన్ కిషన్(7), హార్దిక్ పాండ్యా(19), కృనాల్ పాండ్యా(1), అల్జెరీ జోసెఫ్(15), రాహుల్ చాహర్(1)లతొ విజయం దక్కించుకున్నారు. 

టాస్ ఓడి బ్యాటింగ్ ఎంచుకున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ముంబై బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో ముంబైకు 198 పరుగుల టార్గెట్ ను నిర్దేశించారు. పంజాబ్ ఇన్నింగ్స్ ను ఓపెనర్లు కేఎల్ రాహుల్(100; 64 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సులు), క్రిస్ గేల్(63; 36 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సులు) అద్భుతంగా రాణించారు. 

ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన డేవిడ్ మిల్లర్(7), కరుణ్ నాయర్(5), శామ్ కరన్(8), మన్దీప్ సింగ్(7)లు 20 ఓవర్లు పూర్తయ్యేసరికి పరవాలేదనిపించే స్కోరుతో ఇన్నింగ్స్ ముగించారు. ముంబై బౌలర్లలో హార్దిక్ పాండ్యా 2 వికెట్లు తీయగా, జాసన్ బహ్రెండార్ఫ్, బుమ్రా చెరో వికెట్ పడగొట్టారు.