Mumbai Indians : ముంబై ఇండియ‌న్స్ ముక్క‌లైందా? హార్దిక్‌, తిల‌క్ వ‌ర్మల‌ మ‌ధ్య తీవ్ర వాగాద్వం?

ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో ముంబై ఇండియ‌న్స్ క‌థ ముగిసింది.

Mumbai Indians : ముంబై ఇండియ‌న్స్ ముక్క‌లైందా? హార్దిక్‌, తిల‌క్ వ‌ర్మల‌ మ‌ధ్య తీవ్ర వాగాద్వం?

PIC Credit @ MI

Mumbai Indians – Hardik Pandya : ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో ముంబై ఇండియ‌న్స్ క‌థ ముగిసింది. ఐదు సార్లు ఛాంపియ‌న్‌గా నిలిచిన జ‌ట్టు ఈ సారి ప్లే ఆఫ్స్ చేర‌కుండానే ఇంటి బాట ప‌ట్టింది. ఇప్ప‌టి వ‌ర‌కు 12 మ్యాచులు ఆడిన ముంబై 8 మ్యాచుల్లో ఓడిపోయింది. కేవ‌లం నాలుగు మ్యాచుల్లోనే విజ‌యం సాధించింది. మ‌రో రెండు మ్యాచులు ఆడాల్సి ఉంది. ఈ రెండు మ్యాచుల్లోనూ గెలిచినా ముంబై ప్లే ఆఫ్స్‌కు చేరుకోదు. ఈ క్ర‌మంలో ఈ సీజ‌న్‌లో అధికారికంగా ఎలిమినేట్ అయిన మొద‌టి జ‌ట్టుగా నిలిచింది.

వ‌రుస ఓట‌ముల నేప‌థ్యంలో ముంబై ఇండియ‌న్స్ ముక్క‌లైందంటూ జాతీయ మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. ప‌దేళ్ల పాటు రోహిత్ సార‌థ్యంలో ఆడిన ముంబై జ‌ట్టు కొత్త కెప్టెన్ హార్దిక్ శైలికి అల‌వాటు ప‌డ‌లేదని అంటున్నారు. డ్రెస్సింగ్ రూమ్‌లో సంద‌డి కరువు కావ‌డానికి కొత్త కెప్టెన్ శైలి కార‌ణ‌మ‌ని సీనియ‌ర్ ఆట‌గాళ్లు కోచ్ బృందానికి ఫిర్యాదులు చేస్తున్నార‌ట‌.

KL Rahul : స‌న్‌రైజ‌ర్స్ పై ఘోర ఓట‌మి.. ల‌క్నో య‌జ‌మాని సీరియ‌స్‌..! కెప్టెన్‌గా త‌ప్పుకోనున్న కేఎల్ రాహుల్‌?

ఢిల్లీ పై ఓట‌మి..

ఇటీవ‌ల ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ముంబై ఓడిపోయింది. ఈ ఓట‌మికి తెలుగు కుర్రాడు తిల‌క్ వ‌ర్మ‌ను హార్దిక్ పాండ్య బాధ్యుడిని చేశాడ‌ట‌. కాగా.. ఈ మ్యాచ్‌లో తిల‌క్ వ‌ర్మ చాలా గొప్ప‌గా పోరాడాడు. 32 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స‌ర్లు బాది 196.88 స్ట్రైక్‌రేటుతో 63 ప‌రుగులు చేశాడు. ముంబై త‌రుపున ఆ మ్యాచ్‌లో టాప్ స్కోర‌ర్ అత‌డే కావ‌డం గ‌మ‌నార్హం.

ఓటమి పై హార్దిక్ మాట్లాడుతూ.. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో తిలక్ దూకుడుగా ఆడాల్సి ఉంద‌ని, అలా చేయ‌క‌పోవ‌డమే జ‌ట్టు కొంప‌ముంచింద‌ని అన్నాడ‌ట‌. ఓట‌మి మొత్తానికి బాధ్యుడిగా త‌న‌ను చేయ‌డంతో తిల‌క్ నొచ్చుకున్న‌ట్లుగా తెలుస్తోంది. కాగా.. తిల‌క్‌కు మ‌ద్ద‌తుగా రోహిత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్ అండ‌గా నిలిచార‌ట‌. ఈ స‌మ‌యంలో హార్దిక్‌, తిల‌క్ మ‌ధ్య వాగ్వాదం జ‌రిగిన‌ట్లుగా ప్ర‌చారం సాగుతోంది.

Rohit Sharma : ఐపీఎల్‌లో రోహిత్ శ‌ర్మ భ‌విత‌వ్యం పై పాక్ దిగ్గ‌జం వ‌సీం అక్ర‌మ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

కాగా.. సీనియ‌ర్లు జ‌ట్టు మేనేజ్‌మెంట్ బృందంతో ఒక్కొక్క‌రుగా మాట్లాడిన‌ట్లు జాతీయ మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి.