PBKS vs MI : పంజాబ్ కింగ్స్‌తో కీల‌క మ్యాచ్‌.. గ‌బ్బ‌ర్ రికార్డు పై క‌న్నేసిన రోహిత్ శ‌ర్మ‌..

ఆదివారం అహ్మదాబాద్‌లోని న‌రేంద్ర మోదీ స్టేడియం వేదిక‌గా ముంబై ఇండియ‌న్స్‌, రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్లు తల‌ప‌డనున్నాయి.

PBKS vs MI : పంజాబ్ కింగ్స్‌తో కీల‌క మ్యాచ్‌.. గ‌బ్బ‌ర్ రికార్డు పై క‌న్నేసిన రోహిత్ శ‌ర్మ‌..

Courtesy BCCI

Updated On : June 1, 2025 / 3:53 PM IST

ఐపీఎల్ 2025 సీజ‌న్‌లో భాగంగా ఆదివారం అహ్మదాబాద్‌లోని న‌రేంద్ర మోదీ స్టేడియం వేదిక‌గా ముంబై ఇండియ‌న్స్‌, రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్లు తల‌ప‌డనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జ‌ట్టు ఫైన‌ల్ కు చేరుకుంటుంది. ఈ కీల‌క మ్యాచ్ ముందు ముంబై ఇండియ‌న్స్ స్టార్ బ్యాట‌ర్ రోహిత్ శ‌ర్మ‌ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తుంది.

నేటి మ్యాచ్‌లో రోహిత్ 23 ప‌రుగులు చేస్తే.. పంజాబ్ పై అత్య‌ధిక ప‌రుగులు చేసిన మూడో ఆట‌గాడిగా రికార్డుల‌కు ఎక్కుతాడు. ఈ క్ర‌మంలో శిఖ‌ర్ ధావ‌న్‌ను అధిగ‌మిస్తాడు. పంజాబ్ పై ధావ‌న్ 894 ప‌రుగులు చేయ‌గా రోహిత్ శ‌ర్మ 872 ప‌రుగులు చేశాడు.

Rinku Singh : రింకూ సింగ్‌ను పెళ్లిచేసుకోబోతున్న ప్రియా స‌రోజ్ ఎవ‌రు ?

ఇక పంజాబ్ పై అత్య‌ధిక ప‌రుగులు చేసిన జాబితాలో డేవిడ్ వార్న‌ర్ అగ్ర‌స్థానంలో ఉన్నాడు. అత‌డు పంజాబ్ పై 1134 ప‌రుగులు చేశాడు. ఆ త‌రువాత 1104 ప‌రుగుల‌లో విరాట్ కోహ్లీ రెండో స్థానంలో నిలిచాడు.

ఐపీఎల్‌లో పంజాబ్ పై అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాళ్లు వీరే..

డేవిడ్ వార్నర్ – 1134 ప‌రుగులు
విరాట్ కోహ్లీ – 1104 ప‌రుగులు
శిఖ‌ర్ ధావ‌న్ – 894 ప‌రుగులు
రోహిత్ శ‌ర్మ – 872 ప‌రుగులు
ఫాఫ్ డుప్లెసిస్ – 831 ప‌రుగులు

గుజ‌రాత్ టైటాన్స్‌తో జ‌రిగిన ఎలిమినేట‌ర్ మ్యాచ్‌లో రోహిత్ శ‌ర్మ రాణించాడు. 81 ప‌రుగుల‌తో జ‌ట్టు విజ‌యంలో కీల‌క పాత్ర పోషించాడు. కాగా.. 2013 తర్వాత ఓ సీజ‌న్‌లో రోహిత్ శ‌ర్మ నాలుగు హాఫ్ సెంచ‌రీలు సాధించ‌డం ఇదే తొలిసారి.

Rohit Sharma : ఈ పిల్లాడు మామూలోడు కాదురా అయ్యా.. రోహిత్ శ‌ర్మను ఎలా ఔట్ చేయాల‌ని అత‌డినే అడిగాడు.. హిట్‌మ్యాన్ స‌మాధానం ఇదే..

ఇదిలా ఉంటే.. క్వాలిఫ‌య‌ర్‌-2లో విజ‌యం సాధించిన జ‌ట్టు ఐపీఎల్ 2025 ఫైన‌ల్‌కు చేరుకుంటుంది. జూన్ 3న జ‌రిగే ఫైన‌ల్ మ్యాచ్‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టుతో క‌ప్పు కోసం పోటీప‌డ‌నుంది.