IND vs ENG 4th Test : ‘అన్నా వీడికి హిందీ రాదు..’ సర్ఫరాజ్కు సూపర్ పంచ్ ఇచ్చిన షోయబ్ బషీర్
రాంచీ వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్లో ఓ సరదా ఘటన చోటు చేసుకుంది.
IND vs ENG : రాంచీ వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్లో ఓ సరదా ఘటన చోటు చేసుకుంది. రెండో రోజు ఆటలో టీమ్ఇండియా యువ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్, ఇంగ్లాండ్ స్పిన్నర్ షోయబ్ బషీర్ల మధ్య చోటు చేసుకున్న సంభాషణ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
రెండో రోజు ఆటలో ఇన్నింగ్స్ 103వ ఓవర్ను రవీంద్ర జడేజా వేశాడు. ఈ ఓవర్లోని తొలి బంతికి రాబిన్సన్ ఔట్ అయ్యాడు. దీంతో షోయబ్ బషీర్ క్రీజులోకి వచ్చాడు. ఆ సమయంలో షార్ట్ లెగ్లో ఫీల్డింగ్ కు రెడీ అయిన సర్ఫరాజ్.. వీడికి హిందీ రాదన్నా అని జడేజాతో అన్నాడు. దీన్ని విన్న బషీర్ తనకు కొంచెం హిందీ తెలుసు అంటూ సమాధానం ఇచ్చాడు.
దీంతో అక్కడ ఒక్కసారిగా నవ్వులు విరబూశాయి. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారగా నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. కాగా.. రెండు బంతులు మాత్రమే ఆడిన బషీర్ అదే ఓవర్లో రజిత్ పాటిదార్ క్యాచ్ అందుకోవడంతో డకౌట్ అయ్యాడు.
WPL 2024 : కేరళ వరదల్లో సర్వసం పోగొట్టుకుంది.. కట్ చేస్తే డబ్ల్యూపీఎల్లో..
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్లో 353 పరుగులకు ఆలౌటైంది. జోరూట్ (122 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగాడు. ఓలీ రాబిన్సన్ (58) హాఫ్ సెంచరీ చేశాడు. బెన్ ఫోక్స్ (47), జాక్ క్రాలీ (42), జానీ బెయిర్ స్టో (38) లు ఫర్వాలేదనిపించారు. కెప్టెన్ బెన్స్టోక్స్ (3), ఓలీపోప్ (0), బెన్డకెట్ (11) లు విఫలం అయ్యారు. భారత బౌలర్లలో జడేజా నాలుగు వికెట్లతో ఇంగ్లాండ్ పతనాన్ని శాసించాడు. ఆకాశ్ దీప్ మూడు వికెట్లు పడగొట్టాడు. సిరాజ్ రెండు, అశ్విన్ ఓ వికెట్ సాధించాడు.
అనంతరం మొదటి ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ రెండో రోజు లంచ్ విరామానికి వికెట్ నష్టపోయి 34 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ రెండు పరుగులకే ఔట్ కాగా.. యశస్వి జైస్వాల్ (27), శుభ్మన్ గిల్ (4) లు క్రీజులో ఉన్నారు.
IND vs ENG 4th test : 51 పరుగులు 3 వికెట్లు.. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 353 ఆలౌట్
Sarfaraz – isko to Hindi nahi aati hain
Shoaib – Aati hai thodi thodipic.twitter.com/DJ7ZWGS5Jf— Vector Bhai (@Vectorism_) February 24, 2024