Smriti Mandhana : చ‌రిత్ర సృష్టించిన స్మృతి మంధాన‌.. వ‌న్డేల్లో ఏకైక భార‌త మ‌హిళా ప్లేయ‌ర్‌గా..

టీమ్ఇండియా స్టార్ ఓపెన‌ర్ స్మృతి మంధాన అరుదైన ఘ‌న‌త సాధించింది.

Smriti Mandhana : చ‌రిత్ర సృష్టించిన స్మృతి మంధాన‌.. వ‌న్డేల్లో ఏకైక భార‌త మ‌హిళా ప్లేయ‌ర్‌గా..

Smriti Mandhana Creates History becomes fastest Indian woman to complete 4000 ODI runs

Updated On : January 11, 2025 / 10:10 AM IST

టీమ్ఇండియా స్టార్ ఓపెన‌ర్ స్మృతి మంధాన అరుదైన ఘ‌న‌త సాధించింది. వ‌న్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా 4 వేల ప‌రుగులు చేసిన భార‌త ప్లేయ‌ర్‌గా చ‌రిత్ర సృష్టించింది. ఐరాండ్ల్‌తో జ‌రిగిన తొలి వ‌న్డే మ్యాచులో స్మృతి ఈ ఘ‌న‌త అందుకుంది. ఈ మ్యాచ్‌లో స్మృతి 29 బంతుల్లో ఆరు ఫోర్లు, ఓ సిక్స‌ర్ సాయంతో 41 ప‌రుగులు చేసింది. 95 ఇన్నింగ్స్‌ల్లోనే స్మృతి 4వేల ప‌రుగులను పూర్తి చేసుకుంది. ఇక ఓవ‌రాల్‌గా ఈ ఘ‌న‌త సాధించిన మూడో ప్లేయ‌ర్‌గా రికార్డుల‌కు ఎక్కింది.

అంత‌ర్జాతీయ మ‌హిళ‌ల వ‌న్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా 4 వేల ప‌రుగులు చేసిన ప్లేయ‌ర్లు..

బెలిండా క్లార్క్ (ఆస్ట్రేలియా) – 86 ఇన్నింగ్స్‌ల్లో
మెగ్ లానింగ్ (ఆస్ట్రేలియా) – 87 ఇన్నింగ్స్‌ల్లో
స్మృతి మంధాన (భార‌త్‌) – 95 ఇన్నింగ్స్‌ల్లో
లారా వూల్వార్ట్ (ద‌క్షిణాఫ్రికా) – 96 ఇన్నింగ్స్‌ల్లో

Virat Kohli : ఆస్ట్రేలియా నుంచి రాగానే భార్యా, పిల్ల‌ల‌తో క‌లిసి కోహ్లీ ఎక్క‌డికి వెళ్లారో చూశారా ?

క‌రెన్ రోల్ట‌న్ (ఆస్ట్రేలియా) – 103 ఇన్నింగ్స్‌ల్లో
సుజీ బేట్స్ (న్యూజిలాండ్‌) – 105 ఇన్నింగ్స్‌ల్లో
స్టెఫానీ టేల‌ర్ (వెస్టిండీస్‌) – 107 ఇన్నింగ్స్‌ల్లో
టాంసిన్ బ్యూమాంట్ (ఇంగ్లాండ్‌) – 110 ఇన్నింగ్స్‌ల్లో
మిథాలీ రాజ్ (భార‌త్‌) – 112 ఇన్నింగ్స్‌ల్లో
డెబ్బీ హాక్లీ (న్యూజిలాండ్‌) – 112 ఇన్నింగ్స్‌ల్లో

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. తొలి వ‌న్డేలోభార‌త్ 6 వికెట్ల‌తో విజయం సాధించింది. రెగ్యుల‌ర్ కెప్టెన్ హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ ఈ సిరీస్‌కు దూరం కావ‌డంతో స్మృతి మంధాన సార‌థ్యంలో టీమ్ఇండియా బ‌రిలోకి దిగింది. ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 238 ప‌రుగులు చేసింది. ఐర్లాండ్ బ్యాట‌ర్ల‌లో కెప్టెన్ గాబీ లూయిస్ (92; 129 బంతుల్లో 15 ఫోర్లు), లేహ్ పాల్ (59; 73 బంతుల్లో 7 ఫోర్లు) రాణించారు. భార‌త బౌల‌ర్ల‌లో ప్రియా మిశ్రా రెండు, దీప్తి శ‌ర్మ‌, టిటాస్ సాధు, సయాలీ సత్ఘరే లు త‌లా ఓ వికెట్ సాధించారు.

Catch Of The Year : నువ్వు మ‌నిషివా.. ప‌క్షివా..! గాల్లో అమాంతం డైవ్ చేస్తూ..

అనంత‌రం ల‌క్ష్యాన్ని భార‌త్ 34.3 ఓవ‌ర్ల‌లో నాలుగు వికెట్లు ఛేదించింది. భార‌త బ్యాట‌ర్ల‌లో ప్రతీకా రావల్ (89; 96 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్‌), తేజల్ హసబ్నిస్ (53 నాటౌట్; 46 బంతుల్లో 9 ఫోర్లు) అర్ధ‌శ‌త‌కాల‌తో రాణించింది. కెప్టెన్ స్మృతి మంధాన (41; 29 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌) వేగంగా ఆడింది.

ఈ విజ‌యంతో భార‌త్ మూడు వ‌న్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది.